logo

Crime News: నీట్‌లో మంచి ర్యాంకు రాలేదని యువతి ఆత్మహత్య

Eenadu icon
By Telangana Dist. Team Updated : 15 Jun 2025 20:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వెల్దండ: నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం నారాయణపూర్‌ తండాలో విషాదం చోటు చేసుకుంది. నీట్‌లో మంచి ర్యాంకు రాలేదని యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని తండాకు చెందిన ఇస్లావత్‌ శ్రావణి (19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శనివారం విడుదలైన నీట్‌ ఫలితాల్లో మంచి ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికి గురైంది. కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లిన సమయంలో బలన్మరణానికి పాల్పడింది. శ్రావణికి రెండో ప్రయత్నంలోనూ నీట్‌లో మంచి ర్యాంకు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు.

Tags :
Published : 15 Jun 2025 19:29 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు