logo

Kalvakuntla Kavitha: చింతమడకకు కవిత.. బాల్య స్నేహితురాలికి పరామర్శ

Eenadu icon
By Telangana Dist. Team Published : 05 Oct 2025 19:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సిద్దిపేట: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన చిన్ననాటి స్నేహితురాలు వెంకటలక్ష్మిని పరామర్శించారు. ఇటీవల ఆమె భర్త మల్లారెడ్డి మృతి చెందడంతో చింతమడకకు వచ్చిన కవిత.. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ‘‘20 రోజుల వ్యవధిలోనే రెండోసారి చింతమడకకు రావాల్సి వచ్చింది. ఈ విషాద సమయంలో నా బాల్య మిత్రురాలిని ఓదార్చడం.. స్నేహితురాలిగా భరోసా ఇవ్వడం నా బాధ్యత.

20 రోజుల క్రితం బతుకమ్మ పండగకు వచ్చినప్పుడు గ్రామ ప్రజలంతా పెద్దఎత్తున స్వాగతం పలికారు. వెంకటలక్ష్మి, బాలమణిలతో కలిసి చిన్నప్పుడు బతుకమ్మ ఆడుకున్న రోజులను గుర్తుచేసుకున్నాం. ఆడబిడ్డకు భర్తను కోల్పోవడాన్ని మించిన దుఃఖం ఇంకొకటి ఉండదు. ఈ కష్టం నుంచి ఆమె బయటపడాలని, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని కవిత పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని