logo

Uttam Kumar Reddy: అర్హతనుబట్టి ఎంతమందికైనా రేషన్‌ కార్డులిస్తాం: మంత్రి ఉత్తమ్‌

Eenadu icon
By Telangana Dist. Team Published : 28 Mar 2025 19:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హుజూర్‌నగర్‌: ఉగాది రోజున పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రానుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని మంత్రి ఉత్తమ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ రాష్ట్రంలో 85 శాతం జనాభాకు సన్నబియ్యం ఆందనుంది. రేషన్‌ బియ్యాన్ని చాలామంది ఉపయోగించుకోవడం లేదు. దొడ్డు బియ్యం తినకుండా కొందరు బ్లాక్‌లో అమ్ముతున్నారు. బియ్యంతో పాటు త్వరలోనే పప్పు, ఉప్పు లాంటి ఇతర సరకులు ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునేలా ఏర్పాటు చేశాం. కొత్త రేషన్‌ కార్డులు ఎంతమందికి కావాలన్నా అర్హతను బట్టి ఇస్తున్నాం. కార్డు లేకున్నా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే బియ్యం ఇస్తాం. రేషన్‌ బియ్యంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏటా రూ.10,665 కోట్లు ఖర్చు చేస్తున్నాయి’’ అని ఉత్తమ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని