logo

Tamil Nadu: హుండీలో పడిన ఐఫోన్‌.. వేలంలో రూ.10వేలకు దక్కించుకున్న సొంతదారుడు

Eenadu icon
By Tamilnadu News Team Updated : 10 Jan 2025 11:31 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

 సెల్‌ఫోన్‌ యజమాని, ఆలయ అధికారిణి

మహాబలిపురం: చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్‌లోని కందసామి మురుగన్‌ ఆలయానికి గతేడాది ఆగస్టులో చెన్నై అంబత్తూర్‌కు చెందిన దినేష్‌ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి స్వామి దర్శనానికి వచ్చారు. మానసిక ఒత్తిడితో ఉన్న ఆయన తన ఐఫోన్‌ 13 ప్రోను హుండీలో వేసిన సంగతి తెలిసిందే. తిరిగివ్వాలని అధికారులను కోరగా చెన్నై నుంగంబాక్కంలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో విన్నవించాలని తెలిపారు. గతనెల ఆలయ హుండీల లెక్కింపు సమయంలో ఐఫోన్‌ బయటకు తీశారు.  అది స్వామివారికే సొంతమని అందులోని డేటా మాత్రం తీసుకోవచ్చని తెలపడంతో నిరాశకు లోనయ్యాడు. ఎట్టకేలకు దేవాదాయ శాఖ నిబంధనల మేరకు వేలం వేయగా దినేష్‌ రూ.10 వేలకు పాడటంతో బుధవారం ఆలయ ప్రాంగణంలో అధికారులు ఐఫోన్‌ అప్పగించారు.

Tags :
Published : 10 Jan 2025 02:07 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు