logo

Uttam: కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారినా.. వరి సాగులో రికార్డు సాధించాం: మంత్రి ఉత్తమ్‌

Eenadu icon
By Telangana Dist. Team Published : 11 Oct 2025 17:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హనుమకొండ: దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి (Uttam Kumarreddy) తెలిపారు. త్వరలో ధాన్యం కొనుగోళ్లు కూడా ప్రారంభమవుతాయన్నారు. మంత్రి సీతక్కతో కలిసి హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి చుక్కనీరు లిఫ్ట్‌ చేయకుండా మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడో పంటలో కూడా భారతదేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఈ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 108.5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పడుతోంది. దాంట్లో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనుగోలు చేయబోతోంది. భారత దేశంలో ఇంత ధాన్యం ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కొనుగోలు చేయలేదు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటే అది భారత రాష్ట్ర సమితి పాలనలోనే. కృష్ణా జలాల్లో 511 టీఎంసీలు ఏపీ ప్రభుత్వం తీసుకోవచ్చని, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని సంతకాలు చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమే.  

మన నీటి హక్కులు కాపాడే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. నీటి వాటాల విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఇదే విషయాన్ని గతంలో అనేక సార్లు చెప్పాం. కర్ణాటకలో అల్మట్టి డ్యాం ఎత్తు పెంపును కూడా వ్యతిరేకిస్తున్నాం. కృష్ణా జలాల్లో 70 శాతం తెలంగాణకే కేటాయించాలని మేం వాదనలు వినిపిస్తున్నాం. పదేళ్లలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే నిర్మించింది. అది కూడా మూడేళ్లకే కూలింది’’ మంత్రి ఉత్తమ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని