Rahul Gandhi: బిహార్లో భాజపా రిమోట్ కంట్రోల్ సర్కారు: రాహుల్ గాంధీ

ఇంటర్నెట్ డెస్క్: నీతీశ్ కుమార్ను ఎదురుగా పెట్టి బిహార్లో భాజపా రిమోట్ కంట్రోల్ సర్కారును నడుపుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (LoP Rahul Gandhi) ఆరోపించారు. భాజపా నేతృత్వంలోని కేంద్రం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని విమర్శించారు. ప్రతిపక్షాలు పట్టుబట్టడం వల్లే మోదీ ప్రభుత్వం కుల గణనకు అంగీకరించిందన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) నేపథ్యంలో ముజఫ్ఫర్పుర్లో నిర్వహించిన తన తొలి ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. మహారాష్ట్ర, హరియాణాల్లో ఓట్ల చోరీ జరిగిందని, బిహార్లోనూ ఇది పునరావృతమవుతుందని ఆరోపించారు.
‘‘బిహార్ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ ద్వారా నడుస్తోందని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. భాజపా (BJP) కేవలం నీతీశ్ కుమార్ను వాడుకుంటోంది. దేశసంపద కొంతమంది సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. బిహార్ వంటి ప్రాంతాలు పేదరికంలో కూరుకుపోవడానికి ఇదే కారణం. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టంపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఛఠ్ పూజ సందర్భంగా దిల్లీలోని యుమునా నది ఘాట్ వద్ద పూజలు చేయనున్నట్లు ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత అది కృత్రిమంగా నిర్మించిందని తెలుసుకుని వెనకడుగు వేశారు’’ అని రాహుల్ (Rahul Gandhi) విమర్శించారు. ఓట్ల కోసం ప్రధాని మోదీ ఎంతకైనా వెళ్తారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో ఏ సీటూ ఖాళీగా లేదు: అమిత్ షా కీలక వ్యాఖ్యలు
బిహార్ (Bihar News)లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రజలు తమ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆధునిక నలంద విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్ హయాంలోనే నాంది పడిందన్నారు. భవిష్యత్తులో అమెరికన్లు సైతం తమ ఉన్నత విద్య కోసం ఇక్కడి వస్తారని జోస్యం చెప్పారు.
రూ.500కే సిలిండర్: తేజస్వీ యాదవ్
తాము అధికారంలోకి వస్తే రూ.500కే వంటగ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ఆర్జేడీ నేత, ‘మహాగఠ్బంధన్’ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఇటీవల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకున్న అనేక ప్రజాకర్షక చర్యలు.. గతంలో తాను ఇచ్చిన హామీలకు నకలు అని విమర్శించారు. బయటి వ్యక్తుల నియంత్రణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. అవినీతి, శాంతిభద్రతలపై రాజీలేని వైఖరిని అవలంబిస్తానని తెలిపారు.
రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన భాజపా..
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. ఆయన వీధి రౌడీలా మాట్లాడారంటూ మండిపడింది. ‘‘ప్రధానికి ఓటు వేసిన ప్రతి వ్యక్తిని ఆయన అవమానించారు. ఓటర్లను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్, రాహుల్ గాంధీ చొరబాటుదారులకు బహిరంగంగా అండగా నిలుస్తున్నారు’’ అని దుయ్యబట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
యూఏఈలోని ఓ ప్రవాస భారతీయుడికి బంపర్ ఆఫర్ తగిలింది. అబుధాబిలో నిర్వహించే ప్రముఖ లక్కీ డ్రా అయిన ‘బిగ్ టికెట్ అబుధాబి 280’ సిరీస్లో ప్రవాసుడైన శరవణన్ వెంకటాచలం రూ.60.38 కోట్లు (25 మిలియన్ల దిర్హామ్లు) గెలుచుకున్నారు. - 
                                    
                                        

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.. - 
                                    
                                        

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
Air India survivor: ఎయిరిండియా ప్రమాద ఘటలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. - 
                                    
                                        

‘ఎస్ఐఆర్’కు ఈసీ రెడీ.. 12 రాష్ట్రాలు/యూటీల్లో అమలు
కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 4 నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. - 
                                    
                                        

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
సారనాథ్లోని మూలగంధ కుటీ విహారలో గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలను ప్రజాసందర్శనార్థం అందుబాటులో ఉంచారు. - 
                                    
                                        

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
Surat Businessman: తల్లి వర్ధంతి రోజున అన్నదానాలు, వస్త్ర దానాలు నిర్వహిస్తుంటారు. పేదరికంలో ఉండేవారికి ఎంతోకొంత ఆర్థిక సాయం చేయడమూ చూస్తుంటాం. కానీ సూరత్కు చెందిన వ్యాపారవేత్త బాబూ భాయ్ జిరావాలా కొత్త ఆలోచన చేశారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


