ED: దగ్గుమందు రాకెట్‌ కేసు.. కానిస్టేబుల్‌ ఇల్లు చూసి ఈడీ షాక్‌

Eenadu icon
By National News Desk Updated : 15 Dec 2025 08:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

లఖ్‌నవూ: యూరోపియన్‌ శైలి అలంకరణలు, సుడులు తిరిగిన మెట్లు, వింటేజ్‌ లైటింగు, ఖరీదైన వస్తువులతో కూడిన ఆ భవనాన్ని చూసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అవాక్కయ్యారు. కొడీన్‌ కలిపిన దగ్గుమందు రాకెట్‌లో తొలగింపునకు గురై అరెస్టయిన పోలీస్‌ కానిస్టేబులు అలోక్‌ ప్రతాప్‌సింగ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో నిర్మించుకొన్న రాజభవనం లాంటి ఈ ఇంటిపై ఈడీ దాడులు జరిపింది. లఖ్‌నవూ - సుల్తాన్‌పుర్‌ హైవే పక్కన రెండంతస్తులుగా 7,000 చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ భవనం ఖరీదు దాదాపు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా. దాడి అనంతరం పలు వస్తువులను సీజ్‌ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. యూపీ, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో పై దగ్గుమందు టోకు వ్యాపార యూనిట్లు నడుపుతున్న నెట్‌వర్కులో ఆలోక్‌ ప్రతాప్‌సింగ్‌ భాగస్వామిగా ఆరోపణలు ఉన్నాయి. 2006లో నాలుగు కిలోల బంగారం దోపిడీ కేసులోనూ ఈయన అరెస్టు కాగా, సర్వీసు నుంచి తొలగించారు. ఆ తర్వాత నిర్దోషిగా విడుదల కావడంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. దగ్గుమందు కేసు విచారణకు యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ప్రధాన నిందితుడైన శుభం జయస్‌వాల్‌ దుబాయ్‌కి పరారైనట్లుగా అనుమానిస్తున్నారు.

Tags :
Published : 15 Dec 2025 08:38 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు