ISRO: నేడు ఎల్వీఎం3-ఎం5 రాకెట్ ప్రయోగం
మొదలైన కౌంట్డౌన్ ప్రక్రియ

ప్రయోగ వేదికపై ఎల్వీఎం3-ఎం5 రాకెట్
సూళ్లూరుపేట, తిరుమల, న్యూస్టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ఎల్వీఎం3-ఎం5 రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియ శనివారం సాయంత్రం మొదలైంది. ప్రయోగానికి 24 గంటల ముందు కౌంట్డౌన్ను ప్రారంభించారు. రాకెట్కు హైడ్రోజన్, హీలియం నింపే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఇస్రో ఛైర్మన్ నారాయణన్ కౌంట్డౌన్ ప్రక్రియను పరిశీలించారు. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3-ఎం5 రాకెట్ ద్వారా సీఎంఎస్-03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడడంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలగనుంది.
శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు

ఆలయం ఎదుట నారాయణన్, శాస్త్రవేత్తల బృందం
రాకెట్ ప్రయోగం నేపథ్యంలో శనివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని ఇస్రో ఛైర్మన్ నారాయణన్, షార్ డైరెక్టర్ వి.ఎస్.పద్మకుమార్, పలువురు శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. శ్రీవారి మూలవిరాట్ ముందు ఉపగ్రహ నమూనాలను ఉంచి పూజలు చేయించారు. అనంతరం ఆలయం వెలుపల ఇస్రో ఛైర్మన్ మాట్లాడుతూ ‘ఎల్వీఎం3-ఎం5 రాకెట్ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. 4,410 కిలోల బరువున్న సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జీటీవో)లోకి ప్రవేశపెట్టనున్నాం’ అని చెప్పారు. శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయం, సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలోనూ పూజలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆర్జేడీ-కాంగ్రెస్లది ప్రమాదకర కుట్ర
చొరబాటుదారుల్ని ప్రోత్సహించి, సీమాంచల్ ప్రాంతంలో జనాభాపరమైన మార్పుల్ని తీసుకువచ్చేందుకు ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రమాదకరమైన కుట్రపన్నుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. - 
                                    
                                        

అమెరికా హైర్ ఆందోళనకరం
అమెరికాలో ప్రతిపాదిత అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత(హెచ్ఐఆర్ఈ-హైర్) చట్టం.. హెచ్-1బీ వీసా రుసుం లక్ష డాలర్లకు పెంపు కంటే ఆందోళనకరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు. - 
                                    
                                        

కుటుంబ వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు
భారత ప్రజాస్వామ్యానికి కుటుంబ వారసత్వ రాజకీయాలు తీవ్ర ముప్పుగా మారాయని కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు. రాజకీయ అధికారాన్ని సామర్థ్యం, నిబద్ధత, క్షేత్రస్థాయి బలం కన్నా.. కుటుంబ వారసత్వాలు నిర్ణయిస్తే పరిపాలన దెబ్బతింటుందని పేర్కొన్నారు. - 
                                    
                                        

రూ.3 వేల కోట్లు కొల్లగొట్టారా..
దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో పెచ్చరిల్లుతున్న డిజిటల్ అరెస్టు కేసులు, సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మోసాలను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పేర్కొంది. - 
                                    
                                        

ఖర్జూర చెట్ల ఆకులతో కళాకృతులు
ఒడిశాలోని పూరీ జిల్లా కాకత్పుర్కు చెందిన 24 ఏళ్ల సత్యజిత్ మహారాణా.. ఖర్జూర చెట్ల ఆకులతో అద్భుత కళాకృతులను తయారు చేస్తున్నారు. - 
                                    
                                        

నక్సల్స్ ఇలాకాలో సినిమా షూటింగ్
ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న అబూజ్మడ్ ఒకప్పుడు తుపాకీ మోతలతో దద్దరిల్లేది. అక్కడి సహజ అందాలు, దట్టమైన అడవులు, చూడచక్కని కొండ ప్రాంతాలు, పచ్చిక బయళ్లు దశాబ్దాలపాటు రక్తమోడాయి. - 
                                    
                                        

పదేళ్లుగా స్వచ్ఛ భారత్
ఒడిశాలోని బలంగీర్కు చెందిన వైద్యుడు మన్మోహన్ బాగ్.. గత పదేళ్లుగా స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. పర్యావరణాన్ని రక్షించడానికి స్వచ్ఛందంగా ఆయన ఈ పని చేస్తున్నారు. - 
                                    
                                        

సంక్లిష్ట పరిశోధనల కేంద్రంగా భారత్
అత్యంత క్లిష్టమైన, అధిక ప్రభావం చూపే పరిశోధనలకు భారత ప్రభుత్వం మద్దతిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించడానికి, దేశాన్ని సాంకేతిక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దటానికి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. - 
                                    
                                        

ట్రైబునళ్ల సంస్కరణ చట్టంపై విచారణ.. ధర్మాసనాన్ని మార్చాలన్న కేంద్రం
ట్రైబునళ్ల సంస్కరణలు (హేతుబద్దీకరణ, సర్వీసు నిబంధనలు) చట్టం-2021ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ ముగింపునకు వస్తున్న సమయంలో ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. - 
                                    
                                        

జమ్మూలో మళ్లీ రాజధాని
ప్రభుత్వం ఆరు నెలలు శ్రీనగర్లో, మిగతా ఆరు నెలలు జమ్మూలో పనిచేయడమనే ఏళ్లనాటి సంప్రదాయాన్ని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోమవారం పునరుద్ధరించారు. - 
                                    
                                        

సియాటిల్లోని భారత కాన్సులేట్లో ‘వాల్ ఆఫ్ యూనిటీ’
ఏక్తా దివస్ నేపథ్యంలో అమెరికాలోని సియాటిల్లో గల భారత దౌత్య కార్యాలయ నూతన ప్రాంగణంలో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ గౌరవార్థం ‘ఐక్యతా గోడ’(వాల్ ఆఫ్ యూనిటీ)ను ఏర్పాటు చేశారు. - 
                                    
                                        

అవమానాల శాఖను ఏర్పాటు చేయండి
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రధానమంత్రి మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని, బిహార్ను అవమానించారంటూ ప్రతిపక్ష నేతలందరిపై ప్రధానమంత్రి మోదీ ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. - 
                                    
                                        

ఎన్డీయే మళ్లీ వచ్చినా నీతీశ్ను సీఎంను చేయదు: ఖర్గే
బిహార్లో ఎన్డీయే తిరిగి అధికారంలోకి వచ్చినా.. నీతీశ్కుమార్ను మాత్రం మళ్లీ ముఖ్యమంత్రిని చేయదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. దానికి బదులుగా కాషాయ పార్టీలోని మరొకరికి ఆ పదవి కట్టబెడుతుందన్నారు. - 
                                    
                                        

రైతుల వార్షికాదాయం రూ.60వేల లోపే
దేశంలో దాదాపు 80% మంది రైతుల వార్షిక ఆదాయం రూ.17వేల నుంచి రూ.60 వేలలోపే ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. - 
                                    
                                        

ఐదేళ్లలో మీ జీవితం మారాలంటే..
కొత్తగా కెరియర్ మొదలుపెట్టిన యువత ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఐదేళ్లలో మీ జీవితం మారాలంటే మూడు అంశాలను పాటించాలి. - 
                                    
                                        

ఏడాదిలో 29 కీమోథెరపీ సెషన్లు, 3 సర్జరీలు
ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని 83 ఏళ్ల జయా జైట్లీ జయించారు. అంత పెద్ద వయసులోనూ రొమ్ము క్యాన్సర్తో ఆమె పోరాడి విజయం సాధించారు. జయా జైట్లీ సామాజిక కార్యకర్త. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


