Earthquake: నేపాల్‌లో స్వల్ప భూకంపం.. ఉత్తర భారత్‌లోనూ ప్రకంపనలు

Eenadu icon
By National News Team Published : 05 Apr 2025 00:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేపాల్‌లో స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.0 తీవ్రతగా నమోదైంది. గర్ఖాకోట్‌కు మూడు కి.మీ దూరంలో, 20కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం 7.52 గంటల సమయంలో ఇది రికార్డయినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. ఇటు ఉత్తర భారత్‌నూ ఇవి తాకినట్లు తెలిసింది. ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని