CM Siddaramaiah: పిల్లల్లో సృజనాత్మకతను దెబ్బతీస్తున్న హిందీ, ఆంగ్ల భాషలు

Eenadu icon
By National News Desk Updated : 02 Nov 2025 06:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

 కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

ఈనాడు, బెంగళూరు: హిందీ, ఆంగ్ల భాషల ప్రభావంతో బాలల్లో సృజనాత్మకత దెబ్బతింటోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన శనివారం బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘మాతృభాష నిర్లక్ష్యంతో బాలల్లో ఆలోచన, సృజనాత్మకత తగ్గుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలు మాతృభాషలోనే చదువులు, అధ్యయనాలు చేపడుతున్నారు. దురదృష్టవశాత్తు భారత్‌లో మాతృభాషను పరిరక్షించే చట్టాలు లేవు. దీంతో ఆంగ్లం, హిందీ భాషల ప్రభావం విద్యార్థులపై ఎక్కువగా ఉండటంతో వారి ప్రతిభ సన్నగిల్లుతోంది. హిందీ, సంస్కృత భాషలపై కేంద్రం ఆసక్తి చూపుతున్నా, ఆయా రాష్ట్రాల మాతృభాషలను నిర్లక్ష్యం చేస్తోంది. కన్నడ భాషకు శాస్త్రీయ హోదా ఉన్నా అందుకు తగిన నిధులను అందించడం లేదు. కేంద్రం  ఇకనైనా మాతృభాషల్లోనే విద్య తప్పనిసరి చేసే చట్టాలను తీసుకురావాలి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు. కర్ణాటక రాష్ట్రం ఆవిర్భవించి 69 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. కన్నడ భాష పరిరక్షణకు యువత ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.

Tags :
Published : 02 Nov 2025 05:18 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు