కరూర్‌ తొక్కిసలాట బాధిత కుటుంబాలతో విజయ్‌ భేటీ

Eenadu icon
By National News Desk Published : 28 Oct 2025 04:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

చెన్నై, న్యూస్‌టుడే: కరూర్‌ తొక్కిసలాట బాధిత కుటుంబాలతో నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ భేటీ అయ్యారు. తమిళనాడులోని కరూర్‌ జిల్లా వేలుసామిపురంలో సెప్టెంబరు 27న విజయ్‌ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలను నేరుగా ఆయా ప్రాంతాల్లో కలిసేందుకు అనుమతి కోరుతూ విజయ్‌ పోలీసుశాఖకు వినతిపత్రం సమర్పించారు. శాంతి భద్రతల సమస్యల కారణంగా అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను చెన్నై సమీపాన మామల్లపురం వద్ద పూంజేరిలోని ఓ స్టార్‌ హోటల్‌లో సోమవారం కలిశారు. బాధిత కుటుంబాల క్షమాపణ కోరారని, అండగా ఉంటానంటూ విజయ్‌ భరోసా ఇచ్చారని తెలిసింది. ఆర్థిక పరిస్థితి, సమస్యల గురించి రాతపూర్వకంగా తెలుసుకుని ఆ కుటుంబాల్లోని పిల్లల విద్య, వివాహ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సహాయపడతానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశం కోసం కరూర్‌ నుంచి 5 వాహనాల్లో 37 బాధిత కుటుంబాలను ఆదివారం రాత్రే మామల్లపురానికి రప్పించి బస కల్పించారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే రూ.20 లక్షల చొప్పున విజయ్‌ తరఫున అందించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు