Gold: 3 బంగారు నగలు మించి ధరిస్తే జరిమానా

Eenadu icon
By National News Desk Updated : 28 Oct 2025 08:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

త్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌ జిల్లాలో ఉన్న కందద్, ఇంద్రోలి అనే రెండు గ్రామాల్లో.. మహిళలు బంగారు నగలు ధరించడంపై వింత నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచీ వారు వివాహాలు, శుభకార్యాల సమయంలో మూడు బంగారు నగలు మాత్రమే ధరించాలని గ్రామ పెద్దలు షరతు పెట్టారు. ఒకవేళ ఈ షరతును ఉల్లంఘిస్తే రూ.50,000 జరిమానా వేస్తామని హెచ్చరించారు. ఆడంబరాలను అరికట్టడం, ఆర్థిక అసమానతలను తగ్గించడం కోసం ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు. చెవిపోగులు, మంగళ సూత్రం, ముక్కు పుడక మాత్రమే ధరించాలని ప్రకటించారు. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్థానిక మహిళలు స్వాగతించారు.

ఈటీవీ భారత్‌

Tags :
Published : 28 Oct 2025 04:15 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు