వైద్య విద్యార్థుల స్టైపెండ్‌ చెల్లింపులో వైఫల్యం

Eenadu icon
By National News Desk Published : 29 Oct 2025 04:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఎన్‌ఎంసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దిల్లీ: ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ చెల్లింపులో విఫలమవుతున్న జాతీయ వైద్య కమిషన్‌పై (ఎన్‌ఎంసీ) సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యువ డాక్టర్లుగా సేవలందించే ఈ విద్యార్థులు పని గంటల్ని పట్టించుకోకుండా దాదాపు 18 గంటలపాటు విశేష సేవలందిస్తారని, వారికి స్టైపెండ్‌ చెల్లించక పోవడం దారుణమని జస్టిస్‌ అరవింద్‌ కుమార్, జస్టిస్‌ అంజారియాలతో కూడిన ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది. ఈ విషయం దీర్ఘకాలంగా కోర్టులో పెండింగులో ఉన్నా ఎన్‌ఎంసీ మీనమేషాలు లెక్కించడం ఆందోళనకరమని అభిప్రాయపడింది. పలు వైద్య కళాశాలలు ఇంటర్న్‌షిప్‌ స్టైపెండ్‌ చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ వైద్య విద్యార్థులు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు