చేపల పెంపకంతో ఏటా రూ.60 లక్షల రాబడి

Eenadu icon
By National News Desk Updated : 01 Nov 2025 05:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

c పదో తరగతి వరకే చదివిన ఆయన కర్నాల్‌ నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేపల పెంపకంపై శిక్షణ పొందారు. 2000లో తన స్వగ్రామంలో రెండు ఎకరాల పంచాయతీ చెరువు లీజుకు తీసుకొని చేపల పెంపకానికి శ్రీకారం చుట్టారు. 2005లో తన పొలంలోని ఏడెకరాల్లో చేపల హేచరీని ప్రారంభించారు. అలాగే మరో 8 ఎకరాల్లోనూ పలు రకాల చేపలు, రొయ్యల పెంపకాన్ని విస్తరించారు. 2015లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్రగాయమై కర్ర సాయంతో నడుస్తున్నా సుశీల్‌ తన కృషిని ఆపలేదు. ప్రస్తుతం హేచరీ, చేపల విక్రయం ద్వారా ఏటా రూ.60 లక్షల ఆదాయాన్ని గడిస్తున్నారు. చేపల చెరువుల గట్లపై పెంచుతున్న మామిడి, జామ, బ్లాక్‌ బెర్రీ, సపోటా వంటి పండ్లచెట్లతో అదనపు ఆదాయం వస్తోంది. పాతికేళ్లుగా దేశ, విదేశాల రైతులు సుశీల్‌ కుమార్‌ చేపల పెంపకాన్ని పలుమార్లు పరిశీలించారు.

Tags :
Published : 01 Nov 2025 05:03 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు