Corona: కొవిడ్‌ లక్షణాలతో సింహం మృతి?

Eenadu icon
By National News Team Updated : 05 Jun 2021 11:23 IST
Ee
Font size
  • A
  • A+
  • A++

చెన్నై: కరోనా మహమ్మారి జంతువులపైనా పంజా విసురుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని వందలూర్‌లో గల అరిగ్నార్‌ అన్నా జూలాజికల్‌ పార్క్‌లోని ఓ మగసింహం కరోనా లక్షణాలతో మరణించింది. అనారోగ్యంతో మృతిచెందిన ఆ సింహం నుంచి సేకరించిన నమూనాను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్‌ సెంటర్‌కు పంపినట్లు జూ అధికారులు తెలిపారు. అయితే ఆ సింహం కొవిడ్‌ లక్షణాలతోనే మృత్యువాత పడినట్లు ఫలితాల్లో వెల్లడైంది. కానీ జూ అధికారులు మాత్రం సింహానికి కరోనా సోకలేదంటున్నారు. ఇతర అనారోగ్య కారణాలతో మృతిచెంది ఉండవచ్చని పేర్కొంటున్నారు.

మృతిచెందిన ఆ సింహం గతవారం నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో దానికి కరోనా సోకిందేమోనని పశువైద్యులు అనుమానించారు. ఆ సింహం నమూనాలను భోపాల్‌లోని పరీక్షా కేంద్రానికి పంపించారు. కాగా మరికొన్ని సింహాలు కూడా మహమ్మారి బారిన పడినట్లు సన్నిహితవర్గాలు వెల్లడించాయి.


Tags :
Published : 05 Jun 2021 01:25 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    జిల్లా వార్తలు

    లైవ్ టీవీ