Tamil Nadu: తమిళనాట ‘సర్‌’ వద్దు.. అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం

Eenadu icon
By National News Desk Published : 03 Nov 2025 05:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాట ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణ పనులు విడనాడాలని ఎన్నికల కమిషన్‌ను ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ నేతృత్వంలోని అఖిలపక్ష సమావేశం కోరింది. లేకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని తెలిపింది. బిహార్‌ వ్యవహారంతో ‘ఎస్‌ఐఆర్‌’ పనులను తమిళనాడు సీఎం స్టాలిన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల 4 నుంచి డిసెంబరు 4 వరకు తమిళనాడులో ప్రత్యేక సవరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఈసీ ప్రకటించిన నేపథ్యంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం స్టాలిన్‌ అధ్యక్షతన ఆదివారం జరిగింది. తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలలే ఉన్న నేపథ్యంలో ‘సర్‌’ను తీసుకురావడాన్ని ఆమోదించలేమని సమావేశం తీర్మానించింది. వెంటనే ‘సర్‌’ను విడనాడాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పారదర్శకంగా పాటించి 2026 శాసనసభ ఎన్నికలకు తర్వాత చేపట్టాలని కోరింది. ఇందుకు ఈసీ సమ్మతించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్ప తమకు వేరే మార్గంలేదని స్పష్టంచేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు