Tejashwi Yadav: ‘నన్నూ ఇరికిస్తారు’: భాజపాకు కర్ణాటక భయం పట్టుకుందన్న తేజస్వి

పట్నా: ఉద్యోగాలు ఇవ్వడానికి భూములు రాయించుకున్నారన్న కేసుకు సంబంధించి బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి(Rabri Devi)ని ఈడీ ప్రశ్నించడంపై ఆమె కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) స్పందించారు. ఎన్నికల్లో ఓటమి భయంలో వల్లే భాజపా దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని విమర్శించారు.
‘ఇలా జరుగుతుందని మాకు తెలుసు. కర్ణాటక ఓటమి తర్వాత బిహార్(Bihar)లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని వారు(భాజపా) భయపడుతున్నారు. అందుకే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. భవిష్యత్తులో నన్ను కూడా అందులో ఇరికించవచ్చు. కానీ అవన్నీ నేను పట్టించుకోను. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే భయపడాల్సిన అవసరం లేదు’ అని తేజస్వి మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగాలు ఇవ్వడానికి భూములు రాయించుకున్నారన్న కేసులో గురువారం రబ్రీ దేవిని ఈడీ ఐదు గంటల పాటు ప్రశ్నించింది. దిల్లీలోని దర్యాప్తు సంస్థ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. నగదు అక్రమ లావాదేవీల చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆమె సమాధానాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో రబ్రీ దేవితో పాటు ఆమె కుమార్తెలు మీసా భారతి, చందా యాదవ్, రాగిణి యాదవ్, కుమారుడు తేజస్విని గతంలో ఈడీ ప్రశ్నించింది.
2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ(UPA) హయాంలో లాలూ( Lalu Prasad Yadav) రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


