Devendra Fadnavis: పాక్‌ నంబరు నుంచి మహారాష్ట్ర సీఎంకు బెదిరింపులు

Eenadu icon
By National News Team Updated : 28 Feb 2025 12:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis)కు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ బెదిరింపులు పాకిస్థాన్‌ ఫోన్‌ నంబరు నుంచి రావడం గమనార్హం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు వాట్సప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది. అందులో సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ మెసేజ్ చేసిన వ్యక్తి పేరు మాలిక్‌ షాబాజ్ హుమయూన్‌ రాజాదేవ్‌గా పేర్కొన్నాడు. ఈ బెదిరింపుల నేపథ్యంలో సీఎం, ఆయన కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ భవనాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇక, ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde)కు సైతం బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన వాహనాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ముంబయి పోలీసులకు మెయిల్‌ చేశారు. దీనిపై దర్యాప్తు చేయగా.. అది బూటకమని అధికారులు తేల్చారు. 

Tags :
Published : 28 Feb 2025 11:17 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు