Shambala Movie: ఆది సాయికుమార్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్.. ‘శంబాల’

హైదరాబాద్: వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే యువ కథానాయకుడు ఆది సాయికుమార్ (Aadi saikumar) మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ (shambala). అర్చన అయ్యర్ కథానాయిక. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఆది పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఇందులో ఆది పాత్ర పవర్ఫుల్గా ఉంటుందని, ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చిత్ర బృందం చెబుతోంది. కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాల్ని చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారని తెలిపింది. ‘శంబాల’లో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్గా కనిపించనున్నారు. శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని సరికొత్త పాయింట్తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

ఈసారికి సారీ... 2026లోనే వస్తాం మరి..!
2026కౌంట్డౌన్ ప్రారంభమైంది. సినిమా లెక్కలకూ సమయమైంది. మరి అందులో బాలీవుడ్ భామల వాటా ఎంతుందో చూద్దామా! జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటూ తెరపై సందడి చేసే బాలీవుడ్ సోయగాల మెరుపులు ఈ ఏడాది ఎక్కువగా కనిపించనేలేదు. -

ఇది ‘రాజాసాబ్’ టైమ్
‘‘మన టైమ్ మొదలైంది..’’ అంటున్నారు కథానాయకుడు ప్రభాస్. ఇప్పుడాయన సంక్రాంతి బరిలో ‘ది రాజాసాబ్’ సినిమాతో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. -

సీజన్ 2లో ఆ ప్రశ్నలకు సమాధానం
‘‘సింహం, చిరుత.. ఇలాంటి మృగాలు ఎన్ని చేసినా.. ఆ జింక బెదరలేదు. ఎందుకంటే అది జింకే కాదు’’ అంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో ప్రశాంత్ కుమార్ దిమ్మెల తెరకెక్కించారు. -

ఓటీటీలో ఈ వారం
2025కు వీడ్కోలు చెప్పే కథలు.. కొత్త ఏడాదికి స్వాగతం పలికే చిత్రాల కోసమే కదా ప్రేక్షకుల ఎదురుచూపులు. ఓటీటీలు కూడా 2026కి వెల్కమ్ చెప్తూ.. సినీప్రియులకు ఈ వారాంతం నాన్స్టాప్గా వినోదాలు పంచడానికి కొత్త కంటెంట్తో సిద్ధంగా ఉన్నాయి. -

కథాబలం లేకపోతే ఇద్దరికీ నష్టమే
‘సైక్ సిద్ధార్థ’ చిత్రాన్ని దర్శకుడు వరుణ్ రెడ్డి చాలా విభిన్నంగా తెరకెక్కించారని నిర్మాత డి సురేశ్బాబు అన్నారు. అందుకే సినిమా చూసిన వెంటనే తాము కొన్నట్లు తెలియజేశారు. దీన్ని రూ.99 టికెట్ ధరతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. -

‘పతంగ్’ ఎగిరేవరకూ రాజీ పడలేదు!
ఓ సంక్రాంతి పండుగ రోజున తట్టిన ఆలోచనే ‘పతంగ్’ రూపొందడానికి కారణమని, సినిమాకి లభిస్తున్న స్పందన ఎంతో తృప్తినిచ్చిందన్నారు ప్రణీత్ పత్తిపాటి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘పతంగ్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. -

మార్చిలో అల్లు శిరీష్ పెళ్లి
నటుడు అల్లు శిరీష్ కొత్త ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ ఏడాది అక్టోబరులో ఆయనకు.. తన ప్రియురాలు నయనికతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. -

సంక్షిప్త వార్తలు (3)
‘పెద్ది’గా సినీప్రియుల్ని పలకరించనున్నారు కథానాయకుడు రామ్చరణ్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. -

ఒక్క సినిమాకే రూ.19 వేల కోట్లు.. ఈ ఏడాదిలో ప్రపంచంలోనే టాప్
ఈ ఏడాదిలో ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే.. -

‘పెద్ది’ సర్ప్రైజ్లు.. క్లాస్గా బొమన్ ఇరానీ.. గుర్తుపట్టలేని లుక్లో జగపతి బాబు
‘పెద్ది’ సినిమాలోని కీలక పాత్రల లుక్స్ విడుదలయ్యాయి. -

ఆ రోల్కు సందీప్ రెడ్డి వంగాను అనుకున్నా.. కానీ: ‘పతంగ్’ డైరెక్టర్
‘పతంగ్’ సినిమా దర్శకుడు పలు విశేషాలు పంచుకున్నారు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-
నెతన్యాహు వార్టైమ్ ప్రైమ్మినిస్టర్: ట్రంప్ వ్యాఖ్యలు
-

అతడే.. బౌలర్ ఆఫ్ ది ఇయర్: రవిచంద్రన్ అశ్విన్
-

‘జన నాయగన్’ ఈవెంట్ రికార్డు.. ఎంతమంది హాజరయ్యారంటే!
-

వీసా రూల్స్తో భయంభయం.. ఇళ్లకే పరిమితమైన వలసదారులు
-

వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్ తీసుకొన్న పులి
-

రికార్డ్కు అడుగు దూరంలో స్మృతి మంధాన


