Samantha: వెనక్కి తగ్గా.. ఓడిపోలేదు.. వైరల్‌గా మారిన సమంత పోస్ట్‌

గత కొంతకాలంగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న సమంత (Samantha) ఓ పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 07 Dec 2022 19:28 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత (Samantha) ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన పెంపుడు శునకం ఫొటోను శుక్రవారం రాత్రి షేర్‌ చేసిన సామ్‌.. ఆ పోస్ట్‌కి ‘‘వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు’’ అని క్యాప్షన్‌ రాసింది. దీనిపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ‘‘మోర్‌ పవర్‌ టు యూ, బీ స్ట్రాంగ్‌’’ అనే అర్థం వచ్చేలా ఎమోజీలతో కామెంట్స్‌ పెట్టారు. దీంతో ఈ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. సమంత తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించే ఈ పోస్ట్‌ పెట్టారని  అభిమానులు అంటున్నారు. ‘ఏమైంది మేడమ్‌... ధైర్యంగా ఉండండి’ అంటూ సమంతకు ధైర్యం చెబుతున్నారు.

జూన్‌ 16 తర్వాత...

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో అంతగా కనిపించడం లేదు. తరచూ పర్సనల్‌ అప్‌డేట్స్‌ ఇచ్చే సామ్‌.. జూన్‌ 16 తర్వాత ఒక్క పోస్ట్‌ కూడా చేయలేదు. కేవలం సినిమాల అప్‌డేట్స్‌, ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న వాణిజ్య ప్రకటనలను మాత్రమే షేర్‌ చేస్తున్నారు. దీంతో సామ్‌ కెరీర్‌పై నెటిజన్లు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. విడాకుల తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయంటూ మాట్లాడుకున్నారు.

ఈ క్రమంలో సామ్‌ పోస్ట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక, సమంత నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నాయి. త్వరలో ఈ సినిమాలు విడుదల కానున్నాయి. మరోవైపు ఆమె వరుణ్‌ ధావన్‌తో కలసి చేయనున్న ‘సిటాడెల్‌ ఇండియా’ వెబ్‌సిరీస్‌ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధం కానున్న ఈ సిరీస్‌ కోసం ఆమె కసరత్తులు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని