Chiranjeevi: డీప్ ఫేక్, సైబర్ నేరాలకు ఎవరూ భయపడొద్దు: చిరంజీవి

ఇంటర్నెట్ డెస్క్: టెక్నాలజీని మంచి కోసం వాడుకోవాలని చిరంజీవి అన్నారు. తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన ఏక్తా దివస్ కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారు. దేశాన్ని ఏకం చేసి మనకందించిన సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ లాంటి గొప్ప వ్యక్తుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉందని కొనియాడారు. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని అందరూ ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) తెలిపారు. అలాగే ప్రజలకు, సెలబ్రిటీలకు తలనొప్పిగా మారిన డీప్ ఫేక్, సైబర్ నేరాలపై చిరంజీవి స్పందించారు.
‘‘డీప్ ఫేక్ అంశాన్ని ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. డీజీపీ, సీపీ సజ్జనార్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎవరూ డీప్ ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదు. దీనిపై ఒక చట్టం తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. కచ్చితంగా అది జరగాలని కోరుకుంటున్నా. వీటి నుంచి సామాన్యులకు కూడా రక్షణ కలిగిస్తారు. పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. సామాన్యులు కూడా ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు’’ అని చిరంజీవి అన్నారు. టెక్నాలజీని మంచికి ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు.
ఇక రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం పోలీసులు కృషి చేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. నగర ప్రజలకు సేవ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. అందరం కలిసిమెలిసి ఏక్తా దివస్ స్ఫూర్తిని చాటాలని సీపీ పిలుపునిచ్చారు.


Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. - 
                                    
                                        

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్- 2025లో ‘మంజుమ్మల్ బాయ్స్ ’ అదరగొట్టింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


