‘అఖండ 2’ కోసం సర్వేపల్లి సిస్టర్స్‌

Eenadu icon
By Cinema Desk Published : 31 Oct 2025 01:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

‘అఖండ’లో తనదైన సంగీతంతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేసిన సంగీత దర్శకుడు తమన్‌.. ‘అఖండ 2: తాండవం’తోనూ అదే మ్యాజిక్‌ను పునరావృతం చేసేందుకు శ్రమిస్తున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర నేపథ్య సంగీత పనుల్ని వేగవంతం చేశారు తమన్‌. ఇప్పుడీ చిత్రంతో సర్వేపల్లి సిస్టర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న సింగర్స్‌ శ్రేయ, రాజ్యలక్ష్మిలను తెరకు పరిచయం చేయనున్నట్లు గురువారం ప్రకటించారు. ‘‘ఈ చిత్ర నేపథ్య సంగీతానికి ఈ సోదరీమణుల ఎనర్జిటిక్‌ గాత్రం అదనపు ఆకర్షణగా నిలుస్తుంద’’ని చిత్ర వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు