ఎదలో పోటెత్తు సంద్రం.. ఎవడికి తలవంచని గుణం

Eenadu icon
By Cinema Desk Updated : 31 Oct 2025 06:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

‘కాంత’ చిత్రంతో నవంబరులో థియేటర్లలో సందడి చేయనున్నారు హీరో దుల్కర్‌ సల్మాన్‌. ఆయన.. భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ సినిమాని సెల్వమణి సెల్వరాజ్‌ తెరకెక్కించారు. రానా దగ్గుబాటి, దుల్కర్, ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌ నిర్మించారు. సముద్రఖని కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘రేజ్‌ ఆఫ్‌ కాంత’ పేరుతో ఓ ఆంథమ్‌ను విడుదల చేశారు. ‘‘ఎదలో పోటెత్తు సంద్రం.. ఎవడికి తలవంచని గుణం..’’ అంటూ తెలుగు, తమిళం, ఇంగ్లిష్‌ భాషల మేళవింపుగా సాగే ఈ ర్యాప్‌ గీతానికి ఝాను చాంతర్‌ స్వరాలు సమకూర్చారు. తెలుగు ర్యాప్‌ను అభినవ కవి స్వయంగా రచించి.. ఆలపించారు. ‘‘సినిమా స్వర్ణయుగంగా పేర్కొనే 1950ల నాటి మద్రాస్‌ నేపథ్యంలో సాగే కథతో రూపొందిన చిత్రమిది. దుల్కర్, భాగ్యశ్రీల నటన.. వాళ్ల పాత్రలు ఆశ్చర్యపరిచేలా ఉంటాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కూర్పు: లెవెల్లిన్‌ ఆంథోని గోన్సాల్వేస్, ఛాయాగ్రహణం: డాని శాంచెజ్‌ లోపెజ్‌.


Tags :
Published : 31 Oct 2025 01:54 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు