సంక్షిప్త వార్తలు (5)
క్రికెట్ నేపథ్యంలో కామెడీగా

సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం... ‘జి.ఓ.ఏ.టి’ (గోట్). ఎమ్ చంద్రశేఖర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే టీజర్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రికెట్ నేపథ్యంలో... కామెడీ ప్రధానంగా సాగే కథ ఇదని, ప్రస్తుతం తుదిదశ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని అందులో పేర్కొన్నారు. మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వీ, ఆడుకలం నరైన్, ఆనంద రామరాజు, పమ్మిసాయి, చమ్మక్చంద్ర, నవీన్ నేని తదితరులు నటించారు.
‘స్కూల్ లైఫ్’.. గుర్తుండిపోతుంది

పులివెందుల మహేశ్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘స్కూల్ లైఫ్’. గంగా భవాని నిర్మాత. సావిత్రి, షన్ను కథానాయికలు. సుమన్, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్లో ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. నేనిప్పటి వరకు పోషించిన పాత్రల్లో నా మనసుకు చాలా దగ్గరైన పాత్ర దీంట్లోనిదే అనిపించింది. రైతులకు అండగా నిలిచే రైతుగా నా పాత్ర ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి కథే హీరో. ఈ సినిమా కోసం నేను ఎన్నో పోగొట్టుకున్నా. క్రౌడ్ ఫండింగ్తో నిర్మించిన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు హీరో, దర్శకుడు పులివెందుల మహేశ్. ఈ కార్యక్రమంలో షన్ను, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
అనుపమ్ కొత్త చిత్రం ఖరారు

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కొత్త సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం దర్శక నిర్మాత సూరజ్ బర్జాత్యతో కలిసి పనిచేస్తున్నట్లు ఇన్స్టా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ‘‘ఇంకా పేరు ఖరారు చేయని నా 549వ సినిమా దర్శకుడు సూరజ్ బర్జాత్యతో ప్రారంభమైందని పంచుకోవడానికి సంతోషంగా ఉంది. సూరజ్ నా మొదటి చిత్రానికి ఐదవ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. సుదీర్ఘకాలం తర్వాత ఆయనతో కలిసి పనిచేయడం సృజనాత్మకతతో కూడిన అద్భుతమైన ప్రయాణంగా భావిస్తున్నాను’’ అనే క్యాప్షన్తో అనుపమ్ ఓ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం గోప్యంగా ఉంచిన ఈ సినిమా తారాగణం వివరాల్ని చిత్రబృందం త్వరలోనే వెల్లడించనుంది.
వసుదేవసుతం దేవం

మాస్టర్ మహేంద్రన్ హీరోగా వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ధనలక్ష్మి బాదర్ల నిర్మాత. అంబికా వాణి, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టైటిల్ గీతాన్ని హీరో ఆకాశ్ జగన్నాథ్ ఇటీవల విడుదల చేశారు. ‘‘వసుదేవసుతం దేవం’’ అంటూ సాగే ఈ పాటకు మణిశర్మ స్వరాలు సమకూర్చగా.. చైతన్య ప్రసాద్ సాహిత్యమందించారు. పవన్ - శృతిక సముద్రాల ఆలపించారు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉందని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి జిజ్జు సన్నీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.
నాగలోకంలోకి రూహ్బాబా
గతేడాది ‘భూల్ భులయ్యా’ చిత్రంలో రూహ్ బాబాగా ప్రేక్షకుల్ని పరుగులు పెట్టించిన కార్తిక్ ఆర్యన్.. ఇప్పుడు నాగలోకంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాగ్జిల్లా’. ఈ ఫాంటసీ అడ్వెంచర్కు మృగ్దీప్ సింగ్ లంబా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్ పెట్టారు కార్తిక్. ‘‘భూల్ భులయ్యా 3’ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ‘నాగ్జిల్లా’ చిత్రాన్ని మొదలుపెడుతున్నాం’’ అనే వ్యాఖ్యను జోడించారు. ఇందులో ఆయన పాము, మనిషిలా రెండు భిన్న కోణాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్, మహావీర్ జైన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

జానపదానికి స్టెప్పేస్తే..!
కథానాయకుడు రవితేజ.. దర్శకుడు కిశోర్ తిరుమల కలయికలో ఓ చిత్రం ముస్తాబవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఆషికా రంగనాథ్ కథానాయిక. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. - 
                                    
                                        

ఆ రాకెట్కు ‘బాహుబలి’ పేరు పెట్టడం సంతోషాన్నిచ్చింది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ‘ఎల్వీఎం3-ఎం5’ రాకెట్కు ‘బాహుబలి’ అని పేరు పెట్టడం పట్ల దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. - 
                                    
                                        

కేరళ అడవుల్లో మైసా
రష్మిక తొలిసారి యాక్షన్ పాత్రలో అలరిం చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడామె ప్రధాన పాత్రధారిగా కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’. - 
                                    
                                        

స్వర్ణోత్సవ వేడుకకు రంగం సిద్ధం
విలక్షణ నటుడిగా.. అభిరుచి గల నిర్మాతగా సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు మంచు మోహన్బాబు. - 
                                    
                                        

ఆమె ఓ స్టార్ అనే భావన రానివ్వలేదు
‘ప్రేమని మరో కోణంలో చూపించే సినిమా ‘ది గర్ల్ఫ్రెండ్’. ఇందులోని పాత్రలు, సందర్భాలు మన జీవితాలతో రిలేట్ చేసుకునేలా ఉంటాయి’’ అన్నారు హీరో దీక్షిత్ శెట్టి. ఆయన.. రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. - 
                                    
                                        

డిసెంబరులో అనన్య చిత్రం
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ’. గతంలో కార్తిక్ ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సమీర్ విద్వాన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. - 
                                    
                                        

ఓ తండ్రిగా ఎంతో ఆనందంగా ఉన్నా
‘‘యాక్షన్తో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన చిత్రం ‘ఫీనిక్స్’. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్న నమ్మకముంది’’ అన్నారు కథానాయకుడు విజయ్ సేతుపతి. - 
                                    
                                        

ఒక్క క్షణమైనా ప్రేమించావా?
‘‘మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తే.. మిమ్మల్ని ఎక్కువగా బాధించేవాడు! కళ్లతో చెప్పగలిగినది, మనసుతో చెప్పలేకపోయింది’’ అంటూ శంకర్ ముక్తిల గొప్ప ప్రపంచం నుంచి ‘ఉసే కహ్నా’ అనే గీతాన్ని విడుదల చేసింది ‘తేరే ఇష్క్ మే’ చిత్రబృందం. - 
                                    
                                        

కేరళ పురస్కారాల్లో మంజుమ్మల్ బాయ్స్ సత్తా
వయసుతో సంబంధం లేకుండా పాత్రలతో ప్రయోగాలు చేసే అగ్రహీరో మమ్ముట్టి మరోసారి ఉత్తమ నటుడిగా సత్తా చాటారు. సోమవారం 55వ చలన చిత్ర అవార్డులను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (6)
చదువు కూడా లేని ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. అక్కడి రాజకీయ రాబందులకు కూడా చెక్ పెట్టే స్థాయికి ఎలా ఎదిగిందన్న కథాంశం ఆధారంగా రూపొందిన సిరీస్ ‘మహారాణి సీజన్ 4’. బాలీవుడ్ కథానాయిక హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో పునీత్ ప్రకాశ్ దీన్ని తెరకెక్కించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


