అచ్చియ్యమ్మ విచ్చేసిందహో!

Eenadu icon
By Cinema Desk Published : 02 Nov 2025 02:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కథానాయకుడు రామ్‌చరణ్‌.. దర్శకుడు బుచ్చిబాబు సాన కలయికలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ కథానాయిక. ఆమె ఇందులో అచ్చియ్యమ్మ అనే పాత్రలో కనువిందు చేయనుందని తెలియజేస్తూ చిత్ర బృందం రెండు కొత్త లుక్స్‌ను విడుదల చేసింది. దీంట్లో తనది దేనికీ భయపడని ఫైర్‌బ్రాండ్‌ లాంటి అమ్మాయి తరహా పాత్రగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి. క్రీడా నేపథ్య అంశాలతో ముడిపడి ఉన్న ఈ రూరల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో రామ్‌చరణ్‌ ఓ ఆటకూలీగా కనిపించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్‌ రెహమాన్, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు