Varun Tej: కథ కుదిరింది

Eenadu icon
By Cinema Desk Updated : 01 Apr 2024 12:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

టీవలే ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’తో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు వరుణ్‌ తేజ్‌. ఇప్పుడాయన కరుణ కుమార్‌ దర్శకత్వంలో ‘మట్కా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా  జరుగుతోంది. తాజాగా వరుణ్‌ మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. దీనికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’, ‘మాస్ట్రో’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు గాంధీ. ఇప్పుడాయన వరుణ్‌ కోసం ఓ విభిన్నమైన యాక్షన్‌ కథాంశాన్ని సిద్ధం చేశారు. ఇటీవలే ఆయన వరుణ్‌కు కథ వినిపించారని.. స్క్రిప్ట్‌ నచ్చడంతో తను సినిమా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిసింది. దీన్ని ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ‘మట్కా’ చిత్రీకరణ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

Tags :
Published : 01 Apr 2024 01:33 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని