KGF3: ‘కేజీఎఫ్-3’ వచ్చేది అప్పుడేనా..!

హైదరాబాద్: ప్రశాంత్ నీల్- యశ్ (Yash) కాంబినేషన్లో వచ్చిన ‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలు సంచలనం సృష్టించాయి. విశేషమైన ప్రేక్షకాదరణ పొందడంతో పాటు కాసుల వర్షం కురిపించాయి. దీంతో వీరి కాంబో ఒక బ్రాండ్గా మారింది. అయితే, రెండు భాగాలుగా అలరించిన ఈ సినిమా మూడో పార్ట్ కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘కేజీఎఫ్-3’కు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది.
ఈ చిత్రం వచ్చే ఏడాది అక్టోబర్లో సెట్స్పైకి వెళ్లనున్నట్లు సమాచారం. 2025లో ప్రేక్షకుల ముందుకు రానుందట. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయని టాక్ వినిపిస్తోంది. మొదటి రెండు భాగాలకు వచ్చిన ప్రేక్షకాదరణను దృష్టిలో ఉంచుకొని మూడో పార్ట్ను తీర్చిదిద్దనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన డిసెంబర్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మూడో భాగంలో రాఖీ భాయ్ కనిపించకుండా పోయిన ఆ నాలుగేళ్లలో ఎక్కడున్నాడు? ఏం చేశాడు? అన్నది చూపించనున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ‘సలార్’ పనుల్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్తో ఓ సినిమా చేయనున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమా కంటే ముందే ‘కేజీఎఫ్-3’ చేస్తారా?అనేది తెలియాల్సి ఉంది.
‘రాజారాణి’ టు ‘జవాన్’.. నేనెంతో గర్వపడుతున్నా: అట్లీ సతీమణి పోస్ట్
మరోవైపు యశ్ కూడా తన తర్వాతి సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఆయన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ జేజేపెర్రీతో దిగిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఆయన దగ్గర యశ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. మలయాళం దర్శకురాలు గీతు మోహన్దాస్ దర్శకత్వంలో యశ్ తన తదుపరి సినిమా (Yash 19) చేయనున్నట్లు సమాచారం. ఈ డిసెంబర్లోనే దీని షూటింగ్ మొదలు కానుందని టాక్. దీని తర్వాత ‘కేజీఎఫ్-3’ ప్రాజెక్టులో ఆయన జాయిన్ అవుతారని అంటున్నారు. ఈ ఊహాగానాలన్నింటికీ పుల్స్టాప్ పడాలంటే యశ్, ప్రశాంత్నీల్ నుంచి ఒక ప్రకటన వెలువడాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

‘ఈటీవీ విన్’.. చిత్ర పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
‘ఈటీవీ విన్’ చిత్ర పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. -

‘ఫ్లవర్ కాదు ఫైర్’.. ముందు చెప్పింది నేనే.. కానీ: మంచు లక్ష్మి
‘ఫ్లవర్ కాదు ఫైర్’ డైలాగ్ను ముందుగా తానే చెప్పానని అంటున్నారు మంచు లక్ష్మి. -

అది నిశ్చితార్థం కాదు.. కాబోయే భార్యని పరిచయం చేసిన బెల్లంకొండ
నటుడు బెల్లకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) తన కాబోయే సతీమణి కావ్యను అభిమానులకు పరిచయం చేశారు. ఆమెతో ఉన్న ప్రేమానుబంధాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. -

బెల్లంకొండ వారింట్లో పెళ్లి బాజా.. సందడిగా సాయి శ్రీనివాస్-కావ్యల రోకా వేడుక
నటుల వివాహాలతో టాలీవుడ్లో సందడి నెలకొంది. విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్నకు ఇటీవల గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. -

ఇది నా పూర్వజన్మ సుకృతం: ఎన్టీఆర్
ఎన్టీఆర్ బెంగళూరులో సందడి చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. -

భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్.. మ్యారేజ్ డే గిఫ్ట్ ఇదే!
స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) తన భార్య అల్లు స్నేహారెడ్డికి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. తమ 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆమెను ఆశ్చర్యపరుస్తూ అత్యంత ఖరీదైన బెంజ్ కారును కానుకగా అందజేశారు. -

బాధగా ఉంది..! విడాకుల వ్యవహారంపై స్పందించిన విజయ్..
సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ (Vijay) చుట్టూ ముసురుకున్న వివాదాలపై ఎట్టకేలకు స్పందించారు. ఆ సమస్యల కారణంగా అభిమానులు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే తనకు బాధగా ఉందని వ్యాఖ్యానించారు. -

వైభవంగా అల్లు శిరీష్ వివాహం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, నటుడు అల్లు శిరీష్ (Allu Sirish) ఓ ఇంటివాడయ్యారు. నయనిక (Allu Sirish Wife)తో శిరీష్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. -

‘వారణాసి’.. ఆ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను: ప్రియాంక చోప్రా
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రానున్న ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్నారు. -

వెడ్డింగ్ రిసెప్షన్లో విజయ్, త్రిష.. వీడియోలు వైరల్
విజయ్, త్రిష ఓ వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు. సంబంధిత వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. -

గ్రాండ్గా ‘విరోష్’ వెడ్డింగ్ రిసెప్షన్.. ప్రముఖుల సందడి
విజయ్ దేవరకొండ- రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. -

జూమ్ చేసి మా శరీరాలను ఫొటో తీయాల్సిన అవసరం ఏముంది: హీరోయిన్స్ ఆగ్రహం
సినిమా, పబ్లిక్ ఈవెంట్స్కు హాజరయ్యే హీరోయిన్స్, నటీమణులను అభ్యంతరకర రీతిలో ఫొటోలు తీయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కథానాయిక ఆషిక రంగనాథ్ (Ashika Ranganath) మండిపడ్డారు. -

అందుకు షూటింగ్ ఆపేద్దామన్నా.. రామ్చరణ్ వినలేదు: బుచ్చిబాబు
‘పెద్ది’లోని ‘రయ్ రయ్ రారా’ సాంగ్ షూటింగ్ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు దర్శకుడు బుచ్చిబాబు. -

అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. తరలివచ్చిన ప్రముఖులు
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. -

విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం.. 44 స్కూళ్లలో స్కాలర్షిప్లు..
కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సొంతూరులో సందడి చేశారు. వివాహానంతరం సతీమణి రష్మిక (Rashmika) మందన్నతో స్వగ్రామానికి తిరిగొచ్చారు. -

‘కార్తికేయ’ సినిమాలు చూసి రాజమౌళి మెచ్చుకున్నారు: నిఖిల్
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలో నటించేందుకు సినీ తారలు క్యూ కడతారన్న సంగతి తెలిసిందే. నిడివి తక్కువ ఉన్నా, చిన్న పాత్ర అయినా చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. -

సీఎం రేవంత్ను కలిసిన రష్మిక.. అల్లు వారి ఇంటికి ‘విరోష్’ జోడి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబాన్ని కథానాయిక, విజయ్ దేవరకొండ సతీమణి రష్మిక కలిశారు. -

‘పెద్ది’కి డబ్బింగ్ నేనే చెప్పానండీ.. రామ్చరణ్ జోక్లు..
రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. -

‘విరోష్’ వెడ్డింగ్ రిసెప్షన్.. అభిమానులకు ఇదే విజ్ఞప్తి
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika Mandanna) వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. స్నేహితులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరగ్గా, ఇప్పుడు హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -

‘రణబాలి’లో విజయ్- రష్మిక వెడ్డింగ్.. పోస్టర్ కథ ఇదీ
‘రణబాలి’ వెడ్డింగ్ పోస్టర్ వెనుక ఆసక్తికర విషయాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ పంచుకున్నారు.








