Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్తేజ్తో రవితేజ

ఇంటర్నెట్ డెస్క్: ‘ఈగల్’ (Eagle)తో రవితేజ (Ravi Teja), ‘ఆపరేషన్ వాలెంటైన్’ (operation valentine)తో వరుణ్తేజ్ (Varun Tej) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఇంటర్వ్యూ చేశారు. ‘ఆపరేషన్ ఈగల్ స్పెషల్’ పేరిట సంబంధిత వీడియో విడుదలైంది. అందులోనే.. ‘ఈగల్’ సినిమాలోని హీరో పాత్ర ఎలా ఉండబోతోందన్న విషయాన్ని ముందే చెప్పడం తనకు ఇష్టంలేదన్నారు రవితేజ. వారు ఇంకా ఏం మాట్లారంటే?
వరుణ్: సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ‘సూర్య వర్సెస్ సూర్య’తో దర్శకుడిగా మారాడు. ఆయన వర్క్ నాకు ఇష్టం. మీకెలా అనిపించింది?
రవితేజ: నా ‘డిస్కో రాజా’, ‘ధమాకా’ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశాడు. ఇప్పుడు దర్శకుడిగా నాతో ‘ఈగల్’ తెరకెక్కించాడు. స్క్రిప్టు విషయంలో పర్ఫెక్ట్. నేను పొడవాటి జుట్టుతో నటించడం ఇదే తొలిసారి. నాకు నేనే కొత్తగా కనిపించా. ఇలాంటి ఫీలింగ్ ఇంతకుముందు ‘విక్రమార్కుడు’ (విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్) సినిమా విషయంలో కలిగింది. ఇంతకుమించి ఇప్పుడేం చెప్పలేను. సినిమా చూడాల్సిందే.
రవితేజ: మీ డైరెక్టర్ గురించి చెబుతావా?
వరుణ్: మా సినిమా దర్శకుడు శక్తిప్రతాప్ సింగ్ది రాజస్థాన్. అంతకుముందు పలు చిత్రాలకు వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేశాడు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ కథ చెప్పడానికంటే ముందు ఎయిర్ఫోర్స్కు సంబంధించి కొన్ని విజువల్స్ షూట్ చేసి చూపించాడు. అప్పుడే అతడి సత్తా తెలిసింది. దర్శకత్వం కొత్తే అయినా నటన రాబట్టుకోవడంలో ఎక్కడా రాజీపడలేదు.
రవితేజ: మీ సినిమా ప్రకటన వచ్చాక ‘ఆపరేషన్ వాలెంటైనా?.. ఎవరో కొత్త దర్శకుడు అట’ అంటూ కొంత చర్చ జరిగింది. టీజర్ విడుదలయ్యాక అందరి అభిప్రాయం మారింది. మీ సినిమాలో ఏదో ఉందని అప్పుడే అర్థమైంది.
వరుణ్: అవును అన్నా. టైటిల్ చూసి కొందరు ఇదో లవ్స్టోరీ అనుకున్నారుగానీ కాదు. పుల్వామా దాడి ఆధారంగా ఈ సినిమా రూపొందింది. మేం భారత వాయుసేనతో కలిసి పనిచేశాం. వాళ్లు ఇచ్చిన సలహా మేరకు స్క్రిప్టులో కొన్ని మార్పులు చేశాం. చిత్రీకరణ మంచి అనుభూతి కలిగించింది.
అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించిన ‘ఈగల్’ ఈ నెల 9న, మానుషి చిల్లర్ కథానాయికగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అలాంటి ఘటనతో ఇండస్ట్రీకి చెడ్డపేరు: ‘కరూర్ తొక్కిసలాట’పై అజిత్
తన గురించి నెగెటివ్గా రాయడం చూసి షాక్ అయినట్లు అజిత్ చెప్పారు. - 
                                    
                                        

‘బాహుబలి: ది ఎపిక్’.. ఎడిటింగ్లో తొలగించినవి ఇవే: రాజమౌళి
‘బాహుబలి: ది ఎపిక్’ విడుదల సందర్భంగా రాజమౌళి, ప్రభాస్, రానా ప్రత్యేక ఇంటర్వ్యూలో సందడి చేశారు. ఈ విశేషాలివీ.. - 
                                    
                                        

‘బాహుబలి’ విషయంలో నేను తీసుకున్న కీలక నిర్ణయమదే: సెంథిల్ కుమార్
‘బాహుబలి’ షూటింగ్ విశేషాలను సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ పంచుకున్నారు. - 
                                    
                                        

శరీరమే కాదు.. మీ మనసూ జాగ్రత్త
బలంగా ఉండడమంటే మీ భావోద్వేగాలను అణిచివేయడం కాదు వాటిని అంగీకరించి ధైర్యంగా ఉండడమే అంటోందీ బాలీవుడ్ నటి సారా అలీఖాన్. అంతేకాదు చిత్రపరిశ్రమలో ఒత్తిళ్ల మధ్య ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. - 
                                    
                                        

ఆ విషయంలో బాధ లేదు: ధ్రువ్ విక్రమ్
ప్రముఖ నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా ‘బైసన్’. - 
                                    
                                        

‘బాహుబలి’ రీ రిలీజ్ ప్రభావం.. మీ సినిమాపై ఉండనుందా?: సుధీర్బాబు ఏన్నారంటే
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘జటాధర’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో శుక్రవారం జరిగింది. - 
                                    
                                        

అందుకు బాధపడ్డా.. ప్రీమియర్స్ రిస్కే కానీ..: బన్నీ వాసు
సినిమాలపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఏమన్నారంటే? - 
                                    
                                        

ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు లేవు.. అదే కండీషన్: సిద్ధూ జొన్నలగడ్డ
‘తెలుసు కదా’ టీమ్ ప్రెస్మీట్ నిర్వహించింది. అందులో చిత్రబృందం కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. - 
                                    
                                        

‘కాంతార: చాప్టర్1’.. మూడు నిమిషాల సీన్.. రోజూ గంటన్నర ట్రెక్కింగ్
ఈ విజువల్ వండర్ వెనక రిషబ్శెట్టి విజన్తో పాటు, సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ (cinematographer Arvind Kashyap) విజన్ కూడా ఉంది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వెనక ఉన్న ఆసక్తికర విషయాలను అరవింద్ పంచుకున్నారు. - 
                                    
                                        

వాటి నుంచి కూడా స్ఫూర్తి పొందండి: సమంత
తాజాగా సమంత అభిమానులతో ముచ్చటించారు. - 
                                    
                                        

ఆయనతో నటించాలన్న కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది: రాశీఖన్నా
చిన్ననాటి దసరా రోజులు తనకెంతో ప్రత్యేకమంటోంది నటి రాశీ ఖన్నా. రామ్లీలా మైదానంలో జరిగే రావణ దహన వేడుక.. కంజక్ పూజ కోసం దుర్గా దేవిలా అలంకరించుకున్న క్షణాలు.. అమ్మ చేసే పిండివంటలు.. ఇలా దేవీ నవరాత్రులు బోలెడన్ని జ్ఞాపకాలు పంచిచ్చాయని చెబుతోంది. - 
                                    
                                        

అందుకే చిరంజీవి, రామ్చరణ్లతో సినిమాలు చేయలేదు: సుజీత్
చిరంజీవి, రామ్చరణ్లతో సినిమాలు ఎందుకు చేయలేకపోయారో దర్శకుడు సుజీత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఓజీ’ ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. - 
                                    
                                        

అందుకే ముంబయిలో ఒంటరితనం.. బెంగళూరులో ప్రశాంతం: అనురాగ్ కశ్యప్
తన కొత్త సినిమా ‘నిషాంచి’ ప్రమోషన్స్లో భాగంగా ‘ఈటీవీ భారత్’తో ప్రత్యేకంగా మాట్లాడారు దర్శకుడు అనురాగ్ కశ్యప్. - 
                                    
                                        

నా జీవిత ప్రయాణం కష్టాలమయం కాబట్టే..!
విజయ్ ఆంటోనీ సినిమాలు తెలుగులో సందడి చేస్తూనే ఉంటాయి. ‘బిచ్చగాడు’ తర్వాత ఆయన తెలుగు కథానాయకుల్లో ఒకరిగా మారిపోయారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘భద్రకాళి’ ఈ శుక్రవారం రానున్న సందర్భంగా విజయ్ ఆంటోనీ బుధవారం విలేకర్లతో ముచ్చటించారు. - 
                                    
                                        

పవన్లా ధైర్యంగా మాట్లాడేవాళ్లను ఇప్పటివరకూ చూడలేదు: ప్రియాంక
పవన్లా ధైర్యంగా మాట్లాడేవారిని ఇప్పటివరకూ చూడలేదని నటి ప్రియాంక అన్నారు. - 
                                    
                                        

వారిని మెప్పించేంత గొప్ప సినిమా కాకపోవచ్చు కానీ..: సాయి శ్రీనివాస్
‘కిష్కింధపురి’ విడుదల సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా రివ్యూలపై కామెంట్ చేశారు. - 
                                    
                                        

మిరాయ్: మైనస్ డిగ్రీలలో షూటింగ్.. 9 యాక్షన్ బ్లాక్స్.. 2 సర్ప్రైజ్లు: తేజ సజ్జా
తేజ సజ్జా (Teja Sajja New movie), మంచు మనోజ్ (Manchu Manoj) కీలక పాత్రల్లో యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఫాంటసీ ఫిల్మ్ ‘మిరాయ్’. - 
                                    
                                        

నటుడిగా నిరూపించుకోవాలనే కసి పెరిగింది
ఒక కొత్త పాత్ర చేస్తున్నప్పుడు కలిగే ఉత్సాహం, అది ఇచ్చే తృప్తి వేరు అంటున్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. కథానాయకుడిగా పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆయన... ఈమధ్య కొత్త నేపథ్యంలో సాగే కథలపై దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే ‘కిష్కింధపురి’ చిత్రంలో నటించారు. - 
                                    
                                        

అందుకే ‘మిరాయ్’ టికెట్ ధరలు పెంచబోం.. ‘ది రాజాసాబ్’ ట్రైలర్ అలా: టీజీ విశ్వప్రసాద్
‘మిరాయ్’ టికెట్ ధరలు పెంచే ఉద్దేశం తమకు లేదన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ‘ది రాజాసాబ్’ విడుదలపైనా స్పందించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 



