Dilraju: ఎన్నో ఎత్తుపల్లాలు.. వాళ్ల మాటలు విని భయమేసింది: దిల్రాజు

హైదరాబాద్: ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) నిర్మాత దిల్ రాజు (Dil raju) తాజాగా ప్రెస్మీట్ నిర్వహించి సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను సక్సెస్ చేసినందుకు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. సంక్రాంతి సినిమాలకు సంబంధించి టికెట్ ధరలు, బెనిఫిట్ షోలకు వెసులుబాటు కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. కొవిడ్ తర్వాత నుంచి కెరీర్ పరంగా తాను ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని అన్నారు. కొందరి మాటలు విని తాను ఎంతో భయపడ్డానని చెప్పారు. సక్సెస్ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉండలేమని తెలిపారు.
‘‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరగడానికి ప్రధాన కారణం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. మేము అడగగానే ఆయన ముఖ్య అతిథిగా ఈవెంట్కు హాజరయ్యారు. నా జీవితంలో గొప్ప ఈవెంట్ అది. మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరూ ముందు నిలబడి దానిని అద్భుతమైన కార్యక్రమంగా చేశారు. సంక్రాంతి సినిమాలకు సంబంధించి టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు ఆ రాష్ట్రంలో వెసులుబాటు కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్కు ధన్యవాదాలు. తెలుగు చిత్రాలకు అన్ని ప్రాంతాల్లో క్రేజ్, రేంజ్ పెరుగుతోంది. (గేమ్ ఛేంజర్ను ఉద్దేశించి) పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నా. రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి కంటెంట్ను అన్ని ప్రాంతాలకు పంపించాలి. ఇదొక ప్రత్యేకమైన చిత్రం. 2021 ఆగస్టులో ఇది మొదలైంది. దాదాపు మూడున్నరేళ్ల ప్రయాణం. కొవిడ్ తర్వాత నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు చూశా.
‘వకీల్ సాబ్’ చిత్రాన్ని 2020 మేలో విడుదల చేయాలని భావించా. లాక్డౌన్ కారణంగా 2021 మేలో విడుదల చేశాం. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రం. ఆయనకు నేను వీరాభిమానిని కావడం. ఇలా ఎంతో స్పెషల్గా ఆ సినిమాను రూపొందించాం. బ్లాక్బస్టర్ అవుతుందని భావించా. తీరా చూస్తే సినిమా విడుదలైన నాలుగు రోజులకే మళ్లీ కొవిడ్ వచ్చింది. థియేటర్లు మూసేశారు. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాననే బాధతో సినిమా విడుదలైన వారానికే యూఎస్ వెళ్లిపోయా. ఆ తర్వాత ‘వారిసు’ తీశా. తమిళంలో తీయడం వల్ల అది తమిళ చిత్రమైంది. ఇక్కడ అనుకున్నంత రాలేదు కానీ, ఆ రాష్ట్రంలో మంచిగానే లాభాలు పొందా. ‘బలగం’ చేశా. ఎన్నో ప్రశంసలు అందుకున్నా. తెలంగాణ బ్యాక్డ్రాప్లో సినిమా చేయడం వల్ల ఇక్కడ వంద మార్కులు వస్తే మిగిలినచోట్ల 70 మార్కులే పడ్డాయి. యూనివర్సల్గా విజయం అందుకోలేకపోయా. అలా మూడున్నరేళ్ల ప్రయాణంలో నన్ను నేను విశ్లేషించుకున్నా. అదే సమయంలో ‘ఫ్యామిలీస్టార్’ విడుదలైంది. నా ఏడేళ్ల మనవడు ఫోన్ చేసి.. ‘‘తాత.. నువ్వు బాధలో ఉన్నావని తెలుసు. నీ చేతిలో గేమ్ ఛేంజర్ ఉంది. తప్పకుండా హిట్ కొడతావు’’ అన్నాడు. వాడి మాటలు నన్ను భావోద్వేగానికి గురి చేశాయి. చుట్టుపక్కల వాళ్లు కూడా నా గురించి అలాగే మాట్లాడుకోవడం నా వరకూ వచ్చింది. సినిమాల విషయంలో నా జడ్జిమెంట్ పోయిందని చాలామంది అనుకున్నారు. వాళ్ల మాటలకు ఎంతో భయపడ్డా’’ అని దిల్ రాజు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

బిగ్బాస్ సీజన్9: ఈ వారం రీతూ చౌదరి ఎలిమినేషన్.. టాప్-5లో వీళ్లేనట
బిగ్బాస్ సీజన్9 (Bigg boss 9 telugu) నుంచి రీతూ చౌదరి ఎలిమినేట్ (Rithu Chowdary Elimination) అయ్యారు. -

ఆమిర్- లోకేశ్ మూవీ ఆగిపోయిందంటూ రూమర్స్.. స్పందించిన నటుడు
ఆమిర్ఖాన్- లోకేశ్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ఆగిపోయిందంటూ జరిగిన ప్రచారంపై నటుడు స్పందించారు. -

‘అఖండ 2’ వాయిదా.. ‘ది రాజాసాబ్’పై రూమర్స్.. స్పందించిన నిర్మాత
‘అఖండ 2’ వాయిదా వేళ ‘ది రాజాసాబ్’పై వచ్చిన రూమర్స్పై నిర్మాత విశ్వ ప్రసాద్ స్పందించారు. -

పవర్ లిఫ్టింగ్లో నాలుగు మెడల్స్ సాధించిన నటి ప్రగతి
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రగతి. కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించిన ఆమె జిమ్లో కసరత్తులు చేస్తూ కనిపించారు. -

మంచి సినిమా అందరూ ఆదరిస్తారు.. సావిత్రిలాంటి నటికి మరణం లేదు: వెంకయ్య నాయుడు
‘మంచి’ సినిమా తీస్తే తనతో సహా అందరూ ఆదరిస్తారని, ఈ ప్రపంచంలోనే అత్యంత చౌకైన వినోదం సినిమా మాత్రమేనని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. -

బాలీవుడ్ కొత్త ట్రెండ్పై యామీ గౌతమ్ అసహనం.. హృతిక్ రోషన్ మద్దతు
బాలీవుడ్లో కొత్త ట్రెండ్పై నటి యామీ గౌతమ్ అసహనం వ్యక్తం చేశారు. -

పుష్ప2’ తొక్కిసలాట ఘటనకు ఏడాది.. రూ.2కోట్లు డిపాజిట్ చేశామన్న దిల్రాజు
అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన ‘పుష్ప2’ (Pushpa2) విడుదల సందర్భంగా తొక్కిసలాట (pushpa 2 stampede) ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. -

నా రోమాలు నిక్కబొడుచుకున్నాయ్: సమంత పెళ్లి విశేషాలు చెప్పిన శిల్పారెడ్డి
సమంత పెళ్లి గురించి ఆమె స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి పలు విశేషాలు పంచుకున్నారు. -

మద్రాస్ నా జన్మభూమి.. ఆంధ్రప్రదేశ్ ఆత్మభూమి: బాలకృష్ణ
మద్రాస్ తన జన్మభూమి అని నటుడు బాలకృష్ణ పేర్కొన్నారు. -

రష్మిక ‘విజయ’ నామ సంవత్సరం.. 2025లో పాపులర్ నటీనటులు వీళ్లే!
సినిమాలు, టీవీ షోలు, సెలబ్రిటీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని విశ్లేషించి అందించే వేదిక ఐఎండీబీ. 2025 సంవత్సరానికి గానూ అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినీ నటులు, దర్శకుల జాబితాను తాజాగా ప్రకటించింది. -

జోష్లో మోహన్లాల్.. ఒక భారీ ప్రాజెక్ట్ పూర్తి.. మరోదాంట్లోకి అడుగు
‘దృశ్యం 3’ షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం తెలిపింది. -

‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. అందుకే నవంబరులో రిలీజ్కు భయపడ్డా: రామ్
రామ్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఈ సినిమా థాంక్స్ మీట్లో మాట్లాడారు. -

షేక్ జాయెద్ విజన్కు నేను పెద్ద అభిమానిని: ఏఆర్.రెహమాన్
2010లో ‘జాయెద్ అండ్ ది డ్రీమ్’ నాటక సమయంలో ఆయన విజన్ గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందానని గుర్తు చేసుకున్నారు. -

సమంత వెడ్డింగ్.. ఆ రింగ్ ప్రత్యేకత ఇదే.. మొఘల్ కాలంలో స్పెషల్
తన పెళ్లిలో సమంత చేతికి ఉన్న డైమండ్ రింగ్ గురించి ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. -

సమంత - రాజ్ చేసుకున్న ‘భూతశుద్ధి వివాహం’ గురించి తెలుసా?
అగ్రకథానాయిక సమంత వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో సమంత - రాజ్ నిడిమోరు పెళ్లి జరిగింది. -

‘నేనే చరిత్ర.. నాదే ఆ చరిత్ర’: బాలకృష్ణ పవర్ఫుల్ స్పీచ్
బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘అఖండ 2’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. -

100 సినిమాల హీరో వద్ద.. రూ.3 కోట్లు ఉండవా?
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో కీలక పాత్ర పోషించిన ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. -

ఏడాది పాటు షూటింగ్కు దూరమయ్యా.. కానీ: ప్రమాదంపై నవీన్ పొలిశెట్టి
ప్రమాదం కారణంగా ఏడాది పాటు షూటింగ్లో పాల్గొనలేకపోయానని, ప్రేక్షకుల ఆశీస్సులతో మళ్లీ నటించగలిగానని నవీన్ పొలిశెట్టి అన్నారు. -

వారికి 3 గంటలే నిద్ర.. అక్కడ బ్రేక్ ఉండదు: వర్కింగ్ అవర్స్పై కీర్తి
కీర్తి సురేశ్ నటించిన కొత్త సినిమా ‘రివాల్వర్ రీటా’. ఈ మూవీ శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా ప్రెస్మీట్లో పాల్గొన్నారు. -

ఫిల్మ్మేకర్కు ఇంతకన్నా అవమానం ఉంటుందా?: వేణు ఊడుగుల ఎమోషనల్ స్పీచ్
‘రాజు వెడ్స్ రాంబాయి’ సక్సెస్ మీట్లో దర్శకుడు వేణు ఊడుగుల ఎమోషనల్గా మాట్లాడారు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’
-

50 పైసలు చెల్లుబాటవుతుందా? నాణేలపై RBI ఏం చెప్పిందంటే?
-

ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు
-

‘ధురంధర్’ స్టెప్ వేసిన సైనా నెహ్వాల్
-

‘అఖండ 2’ ఇష్యూ క్లియర్.. విడుదల తేదీపై తమ్మారెడ్డి ఏమన్నారంటే!
-

స్టార్లింక్ సబ్స్క్రిప్షన్ ధర ఇదే.. 30 రోజుల ఫ్రీ ట్రయల్, అపరిమిత డేటా!


