Ramayana: ‘రామాయణ’.. రణ్బీర్పై ట్రోల్స్.. సద్గురు ఏమన్నారంటే!

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ రామాయణాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్న విషయం తెలిసిందే. ‘రామాయణ’ (Ramayana) పేరుతో ప్రతిష్ఠాత్మకంగా ఇది రూపొందుతోంది. అయితే ఇందులో రాముడిగా రణ్బీర్ను ఎంపిక చేయడాన్ని కొందరు తప్పు పడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్పై ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru) స్పందించారు. ఈ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాకు సద్గురు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన వీటిపై స్పందించారు. రాముడిగా రణ్బీర్ ఎంపికను సమర్థించారు.
‘‘అలా ట్రోల్ చేయడం అన్యాయం. గతంలో రణ్బీర్ అలాంటి పాత్రలు చేశాడు. ఇప్పుడు ఇలాంటి పాత్ర చేయడానికి వీల్లేదనడం అన్యాయమైన తీర్పు. భవిష్యత్తులో రాముడి పాత్ర చేయాల్సి వస్తుందని అతడికి తెలియదు కదా.. రేపు ఇంకో సినిమాలో రావణుడిగా నటించవచ్చు.. అప్పుడూ ట్రోల్స్ చేస్తారా?. అలా చేయడం సరైన పద్ధతి కాదు’’ అని అన్నారు. అలాగే ఈ సినిమాలో రావణుడి పాత్రలో యశ్ కనిపించనున్న విషయం తెలిసిందే. దీనిపై సద్గురు స్పందిస్తూ.. యశ్ అందమైన, తెలివైన వ్యక్తి అని చెప్పారు.
ఇక ‘రామాయణ’లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) కూడా నటిస్తున్నారు. ఆయన ఈ సినిమా కోసం తీసుకున్న పారితోషికం మొత్తాన్ని క్యాన్సర్ బాధిత పిల్లల చికిత్స కోసం విరాళంగా ఇచ్చినట్లు తాజాగా తెలిపారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్న వివేక్ ‘రామాయణ’తో భారతీయ చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్నారు.
రెండు భాగాలుగా రానున్న ఈ ప్రాజెక్ట్లో మొదటి పార్ట్కు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. రూ.4000 కోట్ల భారీ బడ్జెట్తో రానున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi), రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్ నటిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్ప్రీత్సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
ఒక పాట కోసం అక్షయ్ కుమార్ 100 కోడిగుడ్లతో కొట్టించుకున్నట్లు కొరియోగ్రాఫర్ తెలిపారు. - 
                                    
                                        

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
తెలుగు, కన్నడ సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న నటికి ఆన్లైన్ వేదికగా వేధింపులు వచ్చాయి. - 
                                    
                                        

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్రాజ్
నేషనల్ అవార్డులపై ప్రకాశ్రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. - 
                                    
                                        

ఆస్కార్లో లాబీయింగ్కు అవకాశం
తనకు అవార్డుల కంటే నటన బాగుందని ప్రశంసలు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు బాలీవుడ్ నటుడు పరేశ్ రావెల్. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డుల విషయంలో లాబీయింగ్కు ఆస్కారం ఉందని చెప్పారు. - 
                                    
                                        

జానపదానికి స్టెప్పేస్తే..!
కథానాయకుడు రవితేజ.. దర్శకుడు కిశోర్ తిరుమల కలయికలో ఓ చిత్రం ముస్తాబవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఆషికా రంగనాథ్ కథానాయిక. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. - 
                                    
                                        

ఆ రాకెట్కు ‘బాహుబలి’ పేరు పెట్టడం సంతోషాన్నిచ్చింది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ‘ఎల్వీఎం3-ఎం5’ రాకెట్కు ‘బాహుబలి’ అని పేరు పెట్టడం పట్ల దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. - 
                                    
                                        

కేరళ అడవుల్లో మైసా
రష్మిక తొలిసారి యాక్షన్ పాత్రలో అలరిం చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడామె ప్రధాన పాత్రధారిగా కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’. - 
                                    
                                        

స్వర్ణోత్సవ వేడుకకు రంగం సిద్ధం
విలక్షణ నటుడిగా.. అభిరుచి గల నిర్మాతగా సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు మంచు మోహన్బాబు. - 
                                    
                                        

ఆమె ఓ స్టార్ అనే భావన రానివ్వలేదు
‘ప్రేమని మరో కోణంలో చూపించే సినిమా ‘ది గర్ల్ఫ్రెండ్’. ఇందులోని పాత్రలు, సందర్భాలు మన జీవితాలతో రిలేట్ చేసుకునేలా ఉంటాయి’’ అన్నారు హీరో దీక్షిత్ శెట్టి. ఆయన.. రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. - 
                                    
                                        

డిసెంబరులో అనన్య చిత్రం
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ’. గతంలో కార్తిక్ ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సమీర్ విద్వాన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. - 
                                    
                                        

ఓ తండ్రిగా ఎంతో ఆనందంగా ఉన్నా
‘‘యాక్షన్తో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన చిత్రం ‘ఫీనిక్స్’. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్న నమ్మకముంది’’ అన్నారు కథానాయకుడు విజయ్ సేతుపతి. - 
                                    
                                        

ఒక్క క్షణమైనా ప్రేమించావా?
‘‘మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తే.. మిమ్మల్ని ఎక్కువగా బాధించేవాడు! కళ్లతో చెప్పగలిగినది, మనసుతో చెప్పలేకపోయింది’’ అంటూ శంకర్ ముక్తిల గొప్ప ప్రపంచం నుంచి ‘ఉసే కహ్నా’ అనే గీతాన్ని విడుదల చేసింది ‘తేరే ఇష్క్ మే’ చిత్రబృందం. - 
                                    
                                        

కేరళ పురస్కారాల్లో మంజుమ్మల్ బాయ్స్ సత్తా
వయసుతో సంబంధం లేకుండా పాత్రలతో ప్రయోగాలు చేసే అగ్రహీరో మమ్ముట్టి మరోసారి ఉత్తమ నటుడిగా సత్తా చాటారు. సోమవారం 55వ చలన చిత్ర అవార్డులను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
చదువు కూడా లేని ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. అక్కడి రాజకీయ రాబందులకు కూడా చెక్ పెట్టే స్థాయికి ఎలా ఎదిగిందన్న కథాంశం ఆధారంగా రూపొందిన సిరీస్ ‘మహారాణి సీజన్ 4’. బాలీవుడ్ కథానాయిక హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో పునీత్ ప్రకాశ్ దీన్ని తెరకెక్కించారు. - 
                                    
                                        

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. - 
                                    
                                        

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్- 2025లో ‘మంజుమ్మల్ బాయ్స్ ’ అదరగొట్టింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తాము అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లో రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 - 
                        
                            

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
 - 
                        
                            

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
 - 
                        
                            

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
 - 
                        
                            

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
 - 
                        
                            

హైదరాబాద్లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
 


