Sharwanand: సమయంతో పోరాటం

‘‘భారతదేశంలో రూపొందిన తొలి మోటోక్రాస్ రేసింగ్ సినిమా మా ‘బైకర్’ అని గర్వంగా చెబుతా’’ అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మాళవిక నాయర్ కథానాయిక. సీనియర్ హీరో రాజశేఖర్ ముఖ్యభూమిక పోషించారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ - ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘ఇక్కడ ప్రతి బైకర్కీ ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకు ఎదురెళ్లే కథ. ఏం జరిగినా పట్టువదలని మొండివాళ్ల కథ...’ అంటూ సాగే ప్రచార చిత్రంలో విజువల్స్ అలరిస్తున్నాయి. బైక్ రేసింగ్ దృశ్యాలు చూపు తిప్పుకోనివ్వవు. ‘ఇక్కడ గెలవడం గొప్ప కాదు, చివరిదాకా పోరాటం గొప్ప’ అనే సంభాషణ కథా నేపథ్యాన్ని పరిచయం చేస్తుంది.
ఈ చిత్రం కోసం శారీరకంగా ప్రత్యేకంగా సన్నద్ధమై నటించిన కథానాయకుడు శర్వానంద్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చేయడం ఒక పెద్ద సవాల్. ఇందులో కనిపించింది ఏదీ విజువల్ ఎఫెక్ట్స్ కాదు. ఇండోనేషియా వెళ్లి అక్కడ నిజమైన బైకర్స్తో తీసిన నిజమైన సన్నివేశాలే. చిత్రీకరణలో ఎన్నెన్నో సాహసాలు చేశాం. ఒక గొప్ప సినిమాని చేశామని గర్వంగా చెప్పుకోగలం. నా కెరీర్కి ఇదొక గొప్ప మలుపు అవుతుంది. ఇందులో కథానాయకుడు రాజశేఖర్తో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నా. ఆయన నటన చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇలాంటి సినిమా తీయాలంటే నిర్మాతలకి ఎంతో ధైర్యం కావాలి’’ అన్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘బైకర్’ ప్రయాణాన్ని ప్రతిరోజూ ఆస్వాదించా. శర్వానంద్ ఈ సినిమాని డబ్బింగ్తో చూసి ‘మీరు చాలా బాగా చేశారు, ఈ పాత్ర చేసినందుకు కృతజ్ఞతలు’ అన్నారు. ఈ సినిమా ఓ గొప్ప అనుభవాన్ని పంచుతుంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ వచ్చిన రేసింగ్‘ సినిమాల్ని మించిన ఓ గొప్ప అనుభూతిని పంచుతుందీ చిత్రం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు యువరాజ్, నటులు నిరూప్తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆస్కార్లో లాబీయింగ్కు అవకాశం
తనకు అవార్డుల కంటే నటన బాగుందని ప్రశంసలు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు బాలీవుడ్ నటుడు పరేశ్ రావెల్. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డుల విషయంలో లాబీయింగ్కు ఆస్కారం ఉందని చెప్పారు. - 
                                    
                                        

జానపదానికి స్టెప్పేస్తే..!
కథానాయకుడు రవితేజ.. దర్శకుడు కిశోర్ తిరుమల కలయికలో ఓ చిత్రం ముస్తాబవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఆషికా రంగనాథ్ కథానాయిక. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. - 
                                    
                                        

ఆ రాకెట్కు ‘బాహుబలి’ పేరు పెట్టడం సంతోషాన్నిచ్చింది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ‘ఎల్వీఎం3-ఎం5’ రాకెట్కు ‘బాహుబలి’ అని పేరు పెట్టడం పట్ల దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. - 
                                    
                                        

కేరళ అడవుల్లో మైసా
రష్మిక తొలిసారి యాక్షన్ పాత్రలో అలరిం చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడామె ప్రధాన పాత్రధారిగా కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’. - 
                                    
                                        

స్వర్ణోత్సవ వేడుకకు రంగం సిద్ధం
విలక్షణ నటుడిగా.. అభిరుచి గల నిర్మాతగా సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు మంచు మోహన్బాబు. - 
                                    
                                        

ఆమె ఓ స్టార్ అనే భావన రానివ్వలేదు
‘ప్రేమని మరో కోణంలో చూపించే సినిమా ‘ది గర్ల్ఫ్రెండ్’. ఇందులోని పాత్రలు, సందర్భాలు మన జీవితాలతో రిలేట్ చేసుకునేలా ఉంటాయి’’ అన్నారు హీరో దీక్షిత్ శెట్టి. ఆయన.. రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. - 
                                    
                                        

డిసెంబరులో అనన్య చిత్రం
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ’. గతంలో కార్తిక్ ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సమీర్ విద్వాన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. - 
                                    
                                        

ఓ తండ్రిగా ఎంతో ఆనందంగా ఉన్నా
‘‘యాక్షన్తో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన చిత్రం ‘ఫీనిక్స్’. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్న నమ్మకముంది’’ అన్నారు కథానాయకుడు విజయ్ సేతుపతి. - 
                                    
                                        

ఒక్క క్షణమైనా ప్రేమించావా?
‘‘మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తే.. మిమ్మల్ని ఎక్కువగా బాధించేవాడు! కళ్లతో చెప్పగలిగినది, మనసుతో చెప్పలేకపోయింది’’ అంటూ శంకర్ ముక్తిల గొప్ప ప్రపంచం నుంచి ‘ఉసే కహ్నా’ అనే గీతాన్ని విడుదల చేసింది ‘తేరే ఇష్క్ మే’ చిత్రబృందం. - 
                                    
                                        

కేరళ పురస్కారాల్లో మంజుమ్మల్ బాయ్స్ సత్తా
వయసుతో సంబంధం లేకుండా పాత్రలతో ప్రయోగాలు చేసే అగ్రహీరో మమ్ముట్టి మరోసారి ఉత్తమ నటుడిగా సత్తా చాటారు. సోమవారం 55వ చలన చిత్ర అవార్డులను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
చదువు కూడా లేని ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. అక్కడి రాజకీయ రాబందులకు కూడా చెక్ పెట్టే స్థాయికి ఎలా ఎదిగిందన్న కథాంశం ఆధారంగా రూపొందిన సిరీస్ ‘మహారాణి సీజన్ 4’. బాలీవుడ్ కథానాయిక హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో పునీత్ ప్రకాశ్ దీన్ని తెరకెక్కించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
 - 
                        
                            

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
 - 
                        
                            

హైదరాబాద్లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

ఆయనను భారత్కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 - 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 


