Movie releases: మైదానంలో ఆట ముగిసింది ఇక థియేటర్లో..
ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లు సినిమాపై గట్టి ప్రభావమే చూపించాయి. భారత జట్టు జైత్రయాత్ర అంతకంతకూ ప్రేక్షకుడిని టీవీలకి కట్టిపడేస్తూ వచ్చింది. మ్యాచ్ల కోసం ప్రత్యేకంగా ఎదురు చూసేలా చేసింది.
ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లు సినిమాపై గట్టి ప్రభావమే చూపించాయి. భారత జట్టు జైత్రయాత్ర అంతకంతకూ ప్రేక్షకుడిని టీవీలకి కట్టిపడేస్తూ వచ్చింది. మ్యాచ్ల కోసం ప్రత్యేకంగా ఎదురు చూసేలా చేసింది. ఆ పరిస్థితులు చూశాక క్రికెట్ తప్ప సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా లేరని దర్శకనిర్మాతలు కొన్నింటిని వాయిదా వేసుకున్నారు. విడుదలైన సినిమాలేమో చాలావరకు ఆదరణ దక్కక ఒకట్రెండు రోజుల్లోనే వెనుదిరిగాయి. కొన్ని సినిమాలకి బాగున్నాయనే టాక్ వచ్చినా సరే... అంతంత మాత్రం వసూళ్లతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. దీనంతటికీ కారణం క్రికెట్ ఫీవరే. ఆదివారంతో ప్రపంచకప్ ముగిసింది. ఇక వినోదం కోసం ప్రేక్షకుడికి ప్రత్యామ్నాయం సినిమానే. అసలు సిసలు ఆట మైదానం నుంచి సినిమా హాల్కి చేరుతోందన్నమాట.
మన దేశంలో క్రికెట్ ఓ మతం అంటుంటారు. భారతీయులకి సినిమా అంటే కూడా అంతే అభిమానం. వినోదం అంటే.. అయితే క్రికెట్ లేదంటే సినిమా అంటుంది అధికశాతం యువతరం. ఇక ప్రపంచ కప్ క్రికెట్ ముగిసింది కాబట్టి కొన్నాళ్లవరకూ వినోదాల ఆస్వాదనకి సినిమానే ప్రత్యామ్నాయం కానుంది. అందుకు తగ్గట్టుగానే పలు నిర్మాణ సంస్థలు అక్కడ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంటే ఇటు విడుదల తేదీల్ని ప్రకటించేశాయి. దీన్నిబట్టి చిత్రసీమ కొత్త చిత్రాల విడుదల కోసం ఎలా సన్నద్ధమవుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇదివరకే విడుదల తేదీల్ని ఖరారు చేసిన సినిమా బృందాలు ఇక ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచనున్నాయి. క్రికెట్ మ్యాచ్ల దృష్ట్యానే ఈ నెల 24కి వాయిదా పడిన ‘ఆదికేశవ’ ప్రచార కార్యక్రమాలు సోమవారం నుంచి ఊపందుకుంటున్నాయి. వైష్ణవ్తేజ్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రమిది. శ్రీకాంత్, శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రధారులుగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందిన ‘కోట బొమ్మాళి పీఎస్’ సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఈ నెల 24న విడుదలకి సిద్ధమైంది.
* లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా... అనే త్రివిక్రమ్ సంభాషణలాగే ఆఖరి నెలలో పంచ్ వేసేందుకు పలు తెలుగు చిత్రాలు సిద్ధమయ్యాయి. డిసెంబరులో క్రిస్మస్ సమయంలో ఒకట్రెండు సినిమాలు తప్ప, విడుదలల హంగామా ఇదివరకు ఉండేది కాదు. కానీ ఈసారి డిసెంబరులోనే పలు కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. 7న నాని ‘హాయ్ నాన్న’ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. 8న విడుదల ఖరారు చేసుకున్న సినిమాలు 3. వరుణ్తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’ ఒకటి కాగా, విష్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరొకటి. నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీమేన్’ మూడవది. ఈ మూడు సినిమాలూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాయంటే థియేటర్ల దగ్గర సందడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ వీటిలో ఒకట్రెండు సినిమాలు వాయిదా పడొచ్చనే అనుమానాలున్నా ప్రేక్షకులు మాత్రం వాటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మూడో వారం మోతే!
ఇక డిసెంబరు మూడో వారం నుంచి ప్రభాస్ ‘సలార్’ జోరు కొనసాగనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘సలార్’ డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 1న ట్రైలర్ని విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాల్లో ఇదొకటి. ప్రముఖ హీరోల సినిమాలతోపాటు... పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాల జోరు కూడా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి. రణ్బీర్కపూర్ ‘యానిమల్’ సినిమాతో డిసెంబరు 1న సందడి చేయనున్నారు. తెలుగు దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కించిన చిత్రమిది. ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. షారుక్ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘డంకీ’ అదే నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రభాస్, రణ్బీర్, షారుక్ తదితర అగ్ర కథానాయకుల చిత్రాలు ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకొస్తుండడంతో థియేటర్లలో భారీ స్థాయిలో హంగామా కనిపించే అవకాశాలున్నాయి. బలమైన అభిమానగణాన్ని సొంతం చేసుకున్న హీరోలు కావడంతో వసూళ్లు హోరెత్తనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
‘కల్కి 2898 ఏడీ’ మ్యూజిక్ ఇలా క్రియేట్ చేశారు: సంతోశ్ నారాయణన్ మెమొరీస్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీనికి తానెలా మ్యూజిక్ అందించారో సంతోశ్ నారాయణన్ వివరించారు.
-
ఎన్నో చిత్రాల్లో చేసినా.. ‘లిల్లీ’గానే గుర్తున్నా : రష్మిక
విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ విడుదలై నేటికి ఐదేళ్లు. ఈసందర్భంగా రష్మిక స్పెషల్ పోస్ట్ పెట్టారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
అలాంటి వారికోసం సమయాన్ని వృథా చేసుకోవద్దు: పరిణితీ చోప్రా
ప్రపంచాన్ని మరిచిపోయి జీవించాలని తన అభిమానులకి జీవిత పాఠాలు చెబుతోంది పరిణితీ చోప్రా. -
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
Double Ismart movie: రామ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ ఓటీటీ డీల్ పూర్తయింది. -
నిహారిక ధైర్యాన్ని మెచ్చుకోవాలి : సిద్ధూ జొన్నలగడ్డ
‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. -
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాయన్’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరించిందా? -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
రాజ్తరుణ్ కథానాయకుడిగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన ‘పురుషోత్తముడు’ మూవీ ప్రేక్షకులను అలరించిందా? -
‘కమిటీ కుర్రోళ్ళు’ వచ్చేశారు.. ట్రైలర్ చూశారా?
యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
ఎన్టీఆర్ కోసం మరో విలన్?
‘దేవర’గా థియేటర్లలో సందడి చేయనున్నారు ఎన్టీఆర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
‘కె.జి.ఎఫ్’ ప్రపంచంలోకి అజిత్?
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సరికొత్త కలయికకు రంగం సిద్ధం చేశారా? ‘కె.జి.ఎఫ్’ ప్రపంచంలోకి అగ్ర కథానాయకుడు అజిత్ను తీసుకొస్తున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి