Movie releases: మైదానంలో ఆట ముగిసింది ఇక థియేటర్లో..
ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లు సినిమాపై గట్టి ప్రభావమే చూపించాయి. భారత జట్టు జైత్రయాత్ర అంతకంతకూ ప్రేక్షకుడిని టీవీలకి కట్టిపడేస్తూ వచ్చింది. మ్యాచ్ల కోసం ప్రత్యేకంగా ఎదురు చూసేలా చేసింది. ఆ పరిస్థితులు చూశాక క్రికెట్ తప్ప సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా లేరని దర్శకనిర్మాతలు కొన్నింటిని వాయిదా వేసుకున్నారు. విడుదలైన సినిమాలేమో చాలావరకు ఆదరణ దక్కక ఒకట్రెండు రోజుల్లోనే వెనుదిరిగాయి. కొన్ని సినిమాలకి బాగున్నాయనే టాక్ వచ్చినా సరే... అంతంత మాత్రం వసూళ్లతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. దీనంతటికీ కారణం క్రికెట్ ఫీవరే. ఆదివారంతో ప్రపంచకప్ ముగిసింది. ఇక వినోదం కోసం ప్రేక్షకుడికి ప్రత్యామ్నాయం సినిమానే. అసలు సిసలు ఆట మైదానం నుంచి సినిమా హాల్కి చేరుతోందన్నమాట.

మన దేశంలో క్రికెట్ ఓ మతం అంటుంటారు. భారతీయులకి సినిమా అంటే కూడా అంతే అభిమానం. వినోదం అంటే.. అయితే క్రికెట్ లేదంటే సినిమా అంటుంది అధికశాతం యువతరం. ఇక ప్రపంచ కప్ క్రికెట్ ముగిసింది కాబట్టి కొన్నాళ్లవరకూ వినోదాల ఆస్వాదనకి సినిమానే ప్రత్యామ్నాయం కానుంది. అందుకు తగ్గట్టుగానే పలు నిర్మాణ సంస్థలు అక్కడ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంటే ఇటు విడుదల తేదీల్ని ప్రకటించేశాయి. దీన్నిబట్టి చిత్రసీమ కొత్త చిత్రాల విడుదల కోసం ఎలా సన్నద్ధమవుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇదివరకే విడుదల తేదీల్ని ఖరారు చేసిన సినిమా బృందాలు ఇక ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచనున్నాయి. క్రికెట్ మ్యాచ్ల దృష్ట్యానే ఈ నెల 24కి వాయిదా పడిన ‘ఆదికేశవ’ ప్రచార కార్యక్రమాలు సోమవారం నుంచి ఊపందుకుంటున్నాయి. వైష్ణవ్తేజ్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రమిది. శ్రీకాంత్, శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రధారులుగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందిన ‘కోట బొమ్మాళి పీఎస్’ సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఈ నెల 24న విడుదలకి సిద్ధమైంది.

* లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా... అనే త్రివిక్రమ్ సంభాషణలాగే ఆఖరి నెలలో పంచ్ వేసేందుకు పలు తెలుగు చిత్రాలు సిద్ధమయ్యాయి. డిసెంబరులో క్రిస్మస్ సమయంలో ఒకట్రెండు సినిమాలు తప్ప, విడుదలల హంగామా ఇదివరకు ఉండేది కాదు. కానీ ఈసారి డిసెంబరులోనే పలు కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. 7న నాని ‘హాయ్ నాన్న’ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. 8న విడుదల ఖరారు చేసుకున్న సినిమాలు 3. వరుణ్తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’ ఒకటి కాగా, విష్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరొకటి. నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీమేన్’ మూడవది. ఈ మూడు సినిమాలూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాయంటే థియేటర్ల దగ్గర సందడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ వీటిలో ఒకట్రెండు సినిమాలు వాయిదా పడొచ్చనే అనుమానాలున్నా ప్రేక్షకులు మాత్రం వాటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మూడో వారం మోతే!

ఇక డిసెంబరు మూడో వారం నుంచి ప్రభాస్ ‘సలార్’ జోరు కొనసాగనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘సలార్’ డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 1న ట్రైలర్ని విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాల్లో ఇదొకటి. ప్రముఖ హీరోల సినిమాలతోపాటు... పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాల జోరు కూడా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి. రణ్బీర్కపూర్ ‘యానిమల్’ సినిమాతో డిసెంబరు 1న సందడి చేయనున్నారు. తెలుగు దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కించిన చిత్రమిది. ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. షారుక్ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘డంకీ’ అదే నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రభాస్, రణ్బీర్, షారుక్ తదితర అగ్ర కథానాయకుల చిత్రాలు ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకొస్తుండడంతో థియేటర్లలో భారీ స్థాయిలో హంగామా కనిపించే అవకాశాలున్నాయి. బలమైన అభిమానగణాన్ని సొంతం చేసుకున్న హీరోలు కావడంతో వసూళ్లు హోరెత్తనున్నాయి.

Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆస్కార్లో లాబీయింగ్కు అవకాశం
తనకు అవార్డుల కంటే నటన బాగుందని ప్రశంసలు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు బాలీవుడ్ నటుడు పరేశ్ రావెల్. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డుల విషయంలో లాబీయింగ్కు ఆస్కారం ఉందని చెప్పారు. - 
                                    
                                        

జానపదానికి స్టెప్పేస్తే..!
కథానాయకుడు రవితేజ.. దర్శకుడు కిశోర్ తిరుమల కలయికలో ఓ చిత్రం ముస్తాబవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఆషికా రంగనాథ్ కథానాయిక. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. - 
                                    
                                        

ఆ రాకెట్కు ‘బాహుబలి’ పేరు పెట్టడం సంతోషాన్నిచ్చింది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ‘ఎల్వీఎం3-ఎం5’ రాకెట్కు ‘బాహుబలి’ అని పేరు పెట్టడం పట్ల దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. - 
                                    
                                        

కేరళ అడవుల్లో మైసా
రష్మిక తొలిసారి యాక్షన్ పాత్రలో అలరిం చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడామె ప్రధాన పాత్రధారిగా కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’. - 
                                    
                                        

స్వర్ణోత్సవ వేడుకకు రంగం సిద్ధం
విలక్షణ నటుడిగా.. అభిరుచి గల నిర్మాతగా సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు మంచు మోహన్బాబు. - 
                                    
                                        

ఆమె ఓ స్టార్ అనే భావన రానివ్వలేదు
‘ప్రేమని మరో కోణంలో చూపించే సినిమా ‘ది గర్ల్ఫ్రెండ్’. ఇందులోని పాత్రలు, సందర్భాలు మన జీవితాలతో రిలేట్ చేసుకునేలా ఉంటాయి’’ అన్నారు హీరో దీక్షిత్ శెట్టి. ఆయన.. రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. - 
                                    
                                        

డిసెంబరులో అనన్య చిత్రం
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ’. గతంలో కార్తిక్ ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సమీర్ విద్వాన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. - 
                                    
                                        

ఓ తండ్రిగా ఎంతో ఆనందంగా ఉన్నా
‘‘యాక్షన్తో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన చిత్రం ‘ఫీనిక్స్’. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్న నమ్మకముంది’’ అన్నారు కథానాయకుడు విజయ్ సేతుపతి. - 
                                    
                                        

ఒక్క క్షణమైనా ప్రేమించావా?
‘‘మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తే.. మిమ్మల్ని ఎక్కువగా బాధించేవాడు! కళ్లతో చెప్పగలిగినది, మనసుతో చెప్పలేకపోయింది’’ అంటూ శంకర్ ముక్తిల గొప్ప ప్రపంచం నుంచి ‘ఉసే కహ్నా’ అనే గీతాన్ని విడుదల చేసింది ‘తేరే ఇష్క్ మే’ చిత్రబృందం. - 
                                    
                                        

కేరళ పురస్కారాల్లో మంజుమ్మల్ బాయ్స్ సత్తా
వయసుతో సంబంధం లేకుండా పాత్రలతో ప్రయోగాలు చేసే అగ్రహీరో మమ్ముట్టి మరోసారి ఉత్తమ నటుడిగా సత్తా చాటారు. సోమవారం 55వ చలన చిత్ర అవార్డులను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
చదువు కూడా లేని ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. అక్కడి రాజకీయ రాబందులకు కూడా చెక్ పెట్టే స్థాయికి ఎలా ఎదిగిందన్న కథాంశం ఆధారంగా రూపొందిన సిరీస్ ‘మహారాణి సీజన్ 4’. బాలీవుడ్ కథానాయిక హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో పునీత్ ప్రకాశ్ దీన్ని తెరకెక్కించారు. - 
                                    
                                        

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. - 
                                    
                                        

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్- 2025లో ‘మంజుమ్మల్ బాయ్స్ ’ అదరగొట్టింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
 - 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 - 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 


