OTT: ఇంకా ఓటీటీలోకి రాని సినిమాలివే.. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?
ఈ ఏడాది థియేటర్లలో విడుదలై, ఇప్పటి వరకూ ఓటీటీలోకి రాని సినిమాల జాబితా ఇది.
ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలకావడమే ఆలస్యం.. ‘ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది?’ అంటూ కొందరు ఆరా తీస్తుంటారు. ఓటీటీలోకి వచ్చిన వెంటనే చూసేస్తారు. కొందరు థియేటర్లలో చూసినా, ఓటీటీలోనూ ఆస్వాదిస్తారు. మీరూ అంతేనా? ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో కొన్ని ఇప్పటికీ రాలేదు. మరి, మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?
జిన్నాకల ఇది..
ఈ దీపావళి కానుకగా (అక్టోబరు 21న) థియేటర్లలో విడుదలై, సందడి చేసిన చిత్రాల్లో ‘జిన్నా’ (Ginna) ఒకటి. మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. టెంట్ హౌస్ పెట్టుకున్న వ్యక్తి సర్పంచ్గా మారాలనుకున్న క్రమంలో ఎవరెవరిని మోసం చేశాడు? ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నాడు? అతని కల నెరవేరిందా, లేదా? అన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, సన్నీలియోనీ కథానాయికలు.
డబ్బింగ్.. లైకింగ్
తెలుగు ఆడియో అందుబాటులో ఉండటంతో డబ్బింగ్ సినిమాలపైనా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది. ఇతర భాషల్లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకొన్న సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడొస్తాయా? అని వేచి చూస్తున్నారు. వాటిల్లో ‘ది లెజెండ్’ (The Legend) ముందుంటుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తమిళంలో రూపొందిన సినిమా ఇది. విదేశాల్లో చదువుకున్న ఓ యువకుడు మాతృభూమిపై ప్రేమతో తన స్వగ్రామానికి చేరుకుంటాడు. ఆయనకు అక్కడ ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే థీమ్తో జేడీ- జెర్రీ దర్శకత్వం వహించారు. స్వీయ నిర్మాణంలో ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ (Saravanan Arul) హీరోగా నటించారు. ఈ సినిమా ‘డిస్నీ+హాట్స్టార్’లో త్వరలోనే స్ట్రీమింగ్ అవుతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇంకా దీనిపై అధికారిక ప్రకటనరాలేదు. ఈ వరుసలో ‘రామ్సేతు’,‘థ్యాంక్ గాడ్’ తదితర హిందీ సినిమాలున్నాయి.
సమస్యలు అధిగమించిన శేఖర్
రాజశేఖర్ హీరోగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్’. మలయాళంలో విజయం అందుకున్న ‘జోసెఫ్’ సినిమాకి రీమేక్గా రూపొందడం, రాజశేఖర్ లుక్స్, ప్రచార చిత్రాలు విభిన్నంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపారు. థియేటర్లలో విడుదవుతుందా? నేరుగా ఓటీటీలోకే వస్తుందా? అనుకున్న ఈ సినిమా మే 20న థియేటర్లలో రిలీజైంది. కానీ, రెండు రోజుల్లోనే సమస్యల్లో చిక్కుకుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో దర్శకురాలతో తనకు విబేధాలు తలెత్తడంతో ఓ ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించగా.. చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలంటూ తొలుత ఆదేశాలు జారీ చేసింది. మరికొన్ని వాదనల అనంతరం సినిమా ప్రదర్శనకు అనుమతినిచ్చింది. ఇప్పటివరకూ ఈ సినిమా ఓటీటీ విడుదల ఖరారుకాకపోవడం గమనార్హం.
థియేటర్లలో ఇవే ఫస్ట్.. కానీ..
2019 నవంబరు 26న హైదరాబాద్ నగరశివారులో జరిగిన గ్యాంగ్రేప్, హత్య ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఆశ ఎన్కౌంటర్’. ఆనంద్ చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్గోపాల్ వర్మ సమర్పించారు. కొన్నాళ్ల విరామం అనంతరం వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘ఇందువదన’. హారర్ కామెడీ నేపథ్యంలో ఎం. శ్రీనివాస రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలు జనవరి 1న థియేటర్లలో విడుదలయ్యాయి. ఇప్పటి వరకూ వీటి ఓటీటీ విడుదలపై సమాచారం లేదు.
ఇటు బయోపిక్.. అటు రొమాంటిక్
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ బయోపిక్ ‘కొండా’. కొండా మురళీ జీవితాధారంగా తెరెకెక్కిన ఈ సినిమా జూన్ 23న థియేటర్లలో విడుదలైంది. ఇందులో అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రధారులు. ఓటీటీలోకి రాలేదు. జూన్ 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సదా నన్ను నడిపే’ చిత్రం ఓటీటీ రిలీజ్ ఖరారుకాలేదు. స్వీయ దర్శకత్వంలో లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా నటించిన రొమాటింక్ కామెడీ చిత్రమిది. వైష్ణవి కథానాయిక.
క్రేజీగా.. బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్
యూత్ ఆడియెన్స్ లక్ష్యంగా, విభిన్న కథాంశంతో దర్శకుడు సంతోశ్ కంభంపాటి తెరకెక్కించిన చిత్రం ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’. విశ్వంత్, మాళవిక నాయకా నాయికలు. అక్టోబరు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా త్వరలోనే ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో రిలీజ్కానుందనే వార్తలొస్తున్నాయి. అధికారిక ప్రకటన వెలువడలేదు. అదే రోజు విడుదలైన ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’ సినిమా కూడా ఓటీటీలోకి రాలేదు. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, నరసింహరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ‘అనుకోని ప్రయాణం’ అక్టోబరు 28న థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వెంకటేశ్ పెద్దిరెడ్ల తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ కాలేదు.
నవంబరు చిత్రాలపైనా..
ఎప్పుడో విడుదలైన సినిమాలపైకాదు నవంబరు తొలి, రెండో వారంలో రిలీజ్ అయినవి ఓటీటీలోకి ఎప్పుడొస్తాయా? అని చాలామంది ఎదురు చూస్తున్నారు. వాటిల్లో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ‘లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్’, అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’, సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘యశోద’ చిత్రాలున్నాయి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
Double Ismart movie: రామ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ ఓటీటీ డీల్ పూర్తయింది. -
ఓటీటీలోకి జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
జాన్వీ కపూర్ నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ‘నెట్ఫ్లిక్స్’ (Netflix)లో ప్రసారం కానుంది. -
ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్లివే: గెటప్ శ్రీను 1.. మనోజ్ బాజ్పాయ్ 100
జులై చివరి వారంలో ఓటీటీ వేదికగా విడుదలైన, మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్సిరీస్లు ఏవంటే? -
‘యేవమ్’ ఓటీటీ రిలీజ్ ఎక్కడంటే..
ఆహాలో స్ర్టీమింగ్కు సిద్ధమైన ‘యేవమ్’ ఎప్పుడంటే? -
శృంగార సన్నివేశాలపై ప్రశ్న: అంజలి రియాక్షన్ ఇదీ
అంజలి నటించిన తాజా వెబ్సిరీస్ ‘బహిష్కరణ’. ఈ సిరీస్ ఈవెంట్లో పాల్గొన్న ఆమెకు ఇంటిమేట్ సీన్స్పై ప్రశ్న ఎదురైంది. ఆమె ఎలా రియాక్ట్ అయ్యారంటే? -
బిగ్బాస్లో అశ్లీల వీడియో.. స్పందించిన జియో సినిమా
బిగ్బాస్ షోపై వస్తోన్న విమర్శలపై జియో సినిమా స్పందించింది. వైరలవుతోన్న వీడియోపై స్పష్టతనిచ్చింది. -
‘రానా నాయుడు 2’.. అప్డేట్ షేర్ చేసిన నెట్ఫ్లిక్స్
‘రానా నాయుడు 2’ సిరీస్కు సంబంధించిన అప్డేట్ను నెట్ఫ్లిక్స్ షేర్ చేసింది. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు. -
ఓటీటీలో ‘బుజ్జి అండ్ భైరవ’ హవా.. వైరలవుతోన్న వార్త!
‘బుజ్జి అండ్ భైరవ’ పేరుతో కల్కి టీమ్ విడుదల చేసిన యానిమేటెడ్ సిరీస్ ఓటీటీలో టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
సూపర్హిట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’.. ఓటీటీలో వచ్చేది అప్పుడేనా?
ఇటీవల విడుదలైన ‘కిల్’ (Kill) విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. -
టాలీవుడ్ నుంచి హాలీవుడ్.. రాజమౌళి గురించి సినీ ప్రముఖులు ఏమన్నారంటే!
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. -
Rakht Brahmand: పీరియాడిక్ ఫాంటసీ సిరీస్లో సమంత
Samantha: సినిమాలతో పాటు వెబ్సిరీస్ల్లోనూ నటిస్తూ అలరిస్తోంది అగ్ర కథానాయిక సమంత. -
సినీ ప్రియులకు షాక్.. టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్పై పన్ను..!
సినిమా టికెట్, ఓటీటీ సబ్స్క్రిప్షన్ ధరలు కర్ణాటక (Karnataka)లో మరింత భారం కానున్నాయి. వీటిపై సెస్ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. -
ట్రెండింగ్లో సుధీర్బాబు చిత్రం.. ఏ స్థానంలో ఉందంటే!
సుధీర్బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ ట్రెండింగ్లో ఉంది. టాప్ 1లో ఉన్నట్లు అమెజాన్ తెలిపింది. -
ఉత్తమ నటుడిగా రానా.. ‘రానా నాయుడు’కు గాను అవార్డు..
ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు రానా. రానా నాయుడు సిరీస్కు గాను ఈ అవార్డు అందుకున్నారు. -
‘ఈటీవీ విన్’లో ‘వీరాంజనేయులు విహార యాత్ర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నరేశ్, శ్రీలక్ష్మి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్సిరీస్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. ‘ఈటీవీ విన్’లో త్వరలోనే విడుదల కానుంది. -
ఓటీటీలోకి ‘భయ్యాజీ’.. ఎప్పుడు? ఎక్కడంటే?
మనోజ్ బాజ్పాయ్ నటించిన 100వ చిత్రం ‘భయ్యాజీ’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. -
బిగ్గెస్ట్ బ్యాంక్ స్కామ్పై సినిమా: ప్రకటించిన నిర్మాణ సంస్థ
1971లో సంచలనం సృష్టించిన ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కామ్’ (దిల్లీ బ్రాంచి) పై సినిమా రూపొందించేందుకు నిర్మాణ సంస్థ ఎలిప్సిస్ ఎంటర్టైన్మెంట్స్ సిద్ధమైంది -
ఓటీటీలోకి ‘రాజు యాదవ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గెటప్ శ్రీను హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. -
ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘#90s’ వెబ్సిరీస్
‘#90s’ వెబ్సిరీస్.. ఓటీటీలో అత్యధికమంది లైక్ చేసిన సిరీస్గా రికార్డు సృష్టించింది. -
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్లు ఇవే..
థియేటర్లో మళ్లీ చిన్న చిత్రాల హవా మొదలైంది. ఈక్రమంలో ఓటీటీలో అలరించేందుకు తెలుగుతో పాటు, ఇతర భాషల సినిమాలు, సిరీస్లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ఓటీటీ వేదికగా ఏ చిత్రాలు అలరించనున్నాయో చూసేయండి. -
తెలుగులో ‘బూమర్ అంకుల్’.. యోగిబాబు కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ నటుడు యోగిబాబు నటించిన ‘బూమర్ అంకుల్’ సినిమా తెలుగులో స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి