Operation Valentine: ఓటమే చవిచూడని రణ విజేతరా ఇతడూ
చిత్రం: ఆపరేషన్ వాలెంటైన్
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: కునాల్ కుందు

మన కంటికి రెప్ప ఎలాగో... దేశ రక్షణలో త్రివిధ దళాలూ అంతే. శత్రువు ఎటువైపు నుంచి వచ్చినా కాచుకుంటూ అలుపెరగని పోరాటం చేస్తుంటాయి. గుండెలనిండా దేశభక్తిని... అణువణువునా మాతృభూమిపై మమకారాన్నీ నింపుకుని సరిహద్దుల్లో నిత్యం కాపలా కాస్తుంటాయి. మన దళాల త్యాగాలు అనన్య సామాన్యమైనవి. ఆ పోరాట స్ఫూర్తి వర్ణనకు అందనిది. సినీ రూపకర్తలు కుదిరినప్పుడల్లా సైనికుల త్యాగాలు... వారి పోరాట స్ఫూర్తి ప్రధానంగా సినిమాల్ని రూపొందిస్తూ దేశభక్తిని చాటుతుంటారు. అయితే సైనిక దళం నేపథ్యంలో వచ్చినన్ని కథలు... నావికాదళం, వైమానిక దళం నేపథ్యంలో రాలేదు. ఈ మధ్యే సినీ రూపకర్తలు ఆ దళాలపైనా దృష్టిపెడుతూ చిత్రాల్ని తెరకెక్కిస్తుంటారు. నావికాదళం నేపథ్యంలో ఇదివరకు వచ్చిన ‘ఘాజీ’ ప్రేక్షకుల్ని అలరించింది. వైమానిక దళం నేపథ్యంలో ఇటీవలే బాలీవుడ్లో తెరకెక్కిన ‘ఫైటర్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదే నేపథ్యంలోనే వరుణ్తేజ్ కథానాయకుడిగా తెలుగు, హిందీ భాషల్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెరకెక్కింది. ఇందులో వరుణ్తేజ్ వైమానిక దళంలో పనిచేసే ఫైటర్ పైలట్గా నటించారు. ఫిబ్రవరి 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని వందేమాతరం పాటని విడుదల చేశారు. దేశభక్తిని, కథానాయకుడి వీరత్వాన్ని చాటి చెప్పే ఈ పాట మార్మోగుతోంది.
యుద్ధ రంగంలో సైనికుడి ప్రతాపాన్ని మండే సూర్యుడితో పోలుస్తూ... ‘‘చూడరా సంగ్రామ శూరుడు మండెరా మధ్యాహ్న సూర్యుడు’ అంటూ మొదలుపెట్టారు రచయిత రామజోగయ్య శాస్త్రి. సైనికుడు కదనరంగంలోకి దిగాక ప్రాణాల్ని లెక్క చేయడు. గగనతలంలో ఫైటర్ పైలట్లు శత్రువులపై నిప్పుల వర్షం కురిపిస్తూ పోరాటం కొనసాగిస్తుంటారనే విషయాన్ని ‘చావునే చండాడు ధీరుడు... నిప్పులు కురిసాడు’ అంటూ ఈ పాటలో వర్ణించారు. కథానాయకుడి పౌరుషం, ప్రతాపాన్ని చాటి చెప్పడంతోపాటు... గగన తలాన నలుదిక్కులా సాగిన అతడి పోరాటం చూసి ఆ నింగి కూడా సాహో అంటూ నేలకి దిగాల్సిందే అని, తుపానులాంటి ఆ దూకుడుకి, వీరావేశానికి శత్రువు ధైర్యం కరిగే మంచులా నీరుగారి పోవల్సిందే అనే భావాన్ని వ్యక్తం చేస్తూ ఈ పాట సాగుతుంది. గెలుపే ధ్యేయం, కర్తవ్యం అయినప్పుడు... ఓటమి చవి చూడని రణవిజేతగా నిలుస్తాడని ఈ పాట చాటింది. మధ్యమధ్యలో వందేమాతరం పంక్తులు పాటకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
చూడరా సంగ్రామ శూరుడు
మండెరా మధ్యాహ్న సూర్యుడు
చావునే చండాడు ధీరుడు
నిప్పులు కురిసాడు
రక్తాన వేడి లావాలు పొంగే
ఇతడి ప్రతాపం దిక్కుల్ని తగిలే
సాహో తలొంచి ఆ నీలి నింగే
ఇలపై ఒరిగే హో
వందేమాతరం
వందేమాతరం
వందేమాతరం
ఎగసే ఎగసే తూఫానై
రేగుతున్నది వీరావేశం
కరిగే మంచై నీరల్లే
జారిపోయే శత్రువు ధైర్యం
గెలుపే గెలుపే ధ్యేయంగా
ఉద్యమించి కదిలే కర్తవ్యం
సుజలాం సుఫలాం
మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం వందే
సుజలాం సుఫలాం
మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం
వందే వందే వందే వందే వందే
।। రక్తాన వేడి...।।
చూడరా సంగ్రామ శూరుడు
మండెరా మధ్యాహ్న సూర్యుడు
ఓటమే చవిచూడని
రణ విజేతరా ఇతడూ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆస్కార్లో లాబీయింగ్కు అవకాశం
తనకు అవార్డుల కంటే నటన బాగుందని ప్రశంసలు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు బాలీవుడ్ నటుడు పరేశ్ రావెల్. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డుల విషయంలో లాబీయింగ్కు ఆస్కారం ఉందని చెప్పారు. - 
                                    
                                        

జానపదానికి స్టెప్పేస్తే..!
కథానాయకుడు రవితేజ.. దర్శకుడు కిశోర్ తిరుమల కలయికలో ఓ చిత్రం ముస్తాబవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఆషికా రంగనాథ్ కథానాయిక. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. - 
                                    
                                        

ఆ రాకెట్కు ‘బాహుబలి’ పేరు పెట్టడం సంతోషాన్నిచ్చింది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ‘ఎల్వీఎం3-ఎం5’ రాకెట్కు ‘బాహుబలి’ అని పేరు పెట్టడం పట్ల దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. - 
                                    
                                        

కేరళ అడవుల్లో మైసా
రష్మిక తొలిసారి యాక్షన్ పాత్రలో అలరిం చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడామె ప్రధాన పాత్రధారిగా కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’. - 
                                    
                                        

స్వర్ణోత్సవ వేడుకకు రంగం సిద్ధం
విలక్షణ నటుడిగా.. అభిరుచి గల నిర్మాతగా సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు మంచు మోహన్బాబు. - 
                                    
                                        

ఆమె ఓ స్టార్ అనే భావన రానివ్వలేదు
‘ప్రేమని మరో కోణంలో చూపించే సినిమా ‘ది గర్ల్ఫ్రెండ్’. ఇందులోని పాత్రలు, సందర్భాలు మన జీవితాలతో రిలేట్ చేసుకునేలా ఉంటాయి’’ అన్నారు హీరో దీక్షిత్ శెట్టి. ఆయన.. రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. - 
                                    
                                        

డిసెంబరులో అనన్య చిత్రం
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ’. గతంలో కార్తిక్ ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సమీర్ విద్వాన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. - 
                                    
                                        

ఓ తండ్రిగా ఎంతో ఆనందంగా ఉన్నా
‘‘యాక్షన్తో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన చిత్రం ‘ఫీనిక్స్’. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్న నమ్మకముంది’’ అన్నారు కథానాయకుడు విజయ్ సేతుపతి. - 
                                    
                                        

ఒక్క క్షణమైనా ప్రేమించావా?
‘‘మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తే.. మిమ్మల్ని ఎక్కువగా బాధించేవాడు! కళ్లతో చెప్పగలిగినది, మనసుతో చెప్పలేకపోయింది’’ అంటూ శంకర్ ముక్తిల గొప్ప ప్రపంచం నుంచి ‘ఉసే కహ్నా’ అనే గీతాన్ని విడుదల చేసింది ‘తేరే ఇష్క్ మే’ చిత్రబృందం. - 
                                    
                                        

కేరళ పురస్కారాల్లో మంజుమ్మల్ బాయ్స్ సత్తా
వయసుతో సంబంధం లేకుండా పాత్రలతో ప్రయోగాలు చేసే అగ్రహీరో మమ్ముట్టి మరోసారి ఉత్తమ నటుడిగా సత్తా చాటారు. సోమవారం 55వ చలన చిత్ర అవార్డులను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
చదువు కూడా లేని ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. అక్కడి రాజకీయ రాబందులకు కూడా చెక్ పెట్టే స్థాయికి ఎలా ఎదిగిందన్న కథాంశం ఆధారంగా రూపొందిన సిరీస్ ‘మహారాణి సీజన్ 4’. బాలీవుడ్ కథానాయిక హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో పునీత్ ప్రకాశ్ దీన్ని తెరకెక్కించారు. - 
                                    
                                        

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. - 
                                    
                                        

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్- 2025లో ‘మంజుమ్మల్ బాయ్స్ ’ అదరగొట్టింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
 - 
                        
                            

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
 - 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 - 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 


