VarunLav: ఓటీటీలో వరుణ్‌-లావణ్య పెళ్లి వేడుక.. స్పందించిన టీమ్‌

Eenadu icon
By Entertainment Team Updated : 07 Nov 2023 17:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్ హీరో వరుణ్‌ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇటలీలోని టస్కానీలో నవంబర్‌1న వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పెళ్లితంతు మొత్తం ఓటీటీలో ప్రసారం కానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వరుణ్‌ తేజ్ టీమ్ స్పందించింది.

మెగా కుటుంబంతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖులు కొందరు వరుణ్-లావణ్యల పెళ్లికి హాజరయ్యారు. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేశాయి. ఈ వేడుక మొత్తం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ వేదికగా త్వరలోనే ప్రసారం కానుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీంతో వారి వివాహ వేడుకను చూడొచ్చంటూ అభిమానులంతా ఆనందించారు. అయితే, ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తాజాగా టీమ్ స్పష్టం చేసింది. ఇలాంటి రూమర్స్‌ సృష్టించొద్దని కోరింది. ఇక ఇటలీలో పెళ్లి వేడుకలకు హాజరుకాలేకపోయిన బంధుమిత్రుల కోసం మెగా ఫ్యామిలీ నవంబర్‌ 5న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించింది. దీనికి టాలీవుడ్‌కు చెందిన జయసుధ, వెంకటేశ్‌, జగపతిబాబు, మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌, దిల్‌రాజు, సుకుమార్‌, బోయపాటి శ్రీనివాస్‌, గుణశేఖర్‌ పలువురు సినీదర్శకులు, నిర్మాతలు, నటులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సంబంధిత ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించాయి.

Tags :
Published : 07 Nov 2023 16:58 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు