దుబ్బాక గడ్డ రీసౌండ్ వినాలి: రఘునందన్
తన జీవితాన్ని దుబ్బాక ప్రజలకు అంకితం చేస్తానని ఉప ఎన్నికలో విజయం సాధించిన భాజపా అభ్యర్థి మాధవనేని రఘునందన్రావు అన్నారు.
సిద్దిపేట: తన జీవితాన్ని దుబ్బాక ప్రజలకు అంకితం చేస్తానని ఉప ఎన్నికలో విజయం సాధించిన భాజపా అభ్యర్థి మాధవనేని రఘునందన్రావు అన్నారు. రాష్ట్రంలో అరాచకపాలనకు దుబ్బాక ప్రజలిచ్చిన తీర్పు ప్రగతిభవన్కు వినిపించాలని చెప్పారు. సిద్దిపేటలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఓ వ్యక్తిని, కుటుంబాన్ని ఏ రకంగా ఇబ్బందులకు గురిచేయొచ్చు.. ఏ విధంగా అవహేళన చేయొచ్చనే వ్యవహారశైలికి ఈ తీర్పు కనువిప్పు కావాలన్నారు. రాష్ట్రంలోని నియంతృత్వ, అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడాలని రఘునందన్రావు పిలుపునిచ్చారు. ఏ గడ్డపై చదువుకున్నానని సీఎం కేసీఆర్ చెప్పారో.. ఆ గడ్డ రీసౌండ్ వినాలని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్షాకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ప్రచారంలో సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, నేతలు డీకే అరుణ, జితేందర్రెడ్డితో పాటు బూత్స్థాయి కార్యకర్తలకు రఘునందన్ ధన్యవాదాలు తెలిపారు. తనతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది భాజపా గెలుపును ఆకాంక్షించారన్నారు. దుబ్బాక నుంచి డల్లాస్ వరకూ తన విజయాన్ని కోరుకున్నారని చెప్పారు.
ఇవీ చదవండి..
విజయాలకు పొంగిపోం.. అపజయాలకు కుంగిపోం
ఓటమికి బాధ్యత వహిస్తున్నా: హరీశ్రావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!