Warner-Australia: ఓపెనర్ వేటలో ఆస్ట్రేలియా.. మరో వార్నర్ వస్తాడా?
డేవిడ్ వార్నర్ (David Warner) వన్డేలు, టెస్టులకు వీడ్కోలు పలకడంతో మరో ఓపెనర్ను వెతికే పనిలో పడింది ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్మెంట్.
క్రీజులో అడుగుపెడితే చాలు బాదుడే అతని మంత్రం. ఆరంభం నుంచే భారీ షాట్లతో చెలరేగడం అతని నైజం. ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీసి మానసికంగానూ పైచేయి సాధించడం అతని వ్యూహం. దిగ్గజాల నిష్క్రమణ తర్వాత సంధి దశలో ఉన్న ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్గా అతను నిలదొక్కుకున్న తీరు.. అద్భుత ప్రదర్శనతో పరుగుల వేటలో సాగిన వైనం గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు దశాబ్దానికిపైగా కంగారూ జట్టు ప్రధాన ఆటగాడిగా కొనసాగిన ఆ క్రికెటరే.. డేవిడ్ వార్నర్ (David Warner). ఇప్పుడు టెస్టులు, వన్డేలను అతను వదిలేశాడు. టీ20ల్లోనే కొనసాగుతానని చెప్పాడు. మరి వార్నర్ లాంటి మరో ఆటగాడు ఆస్ట్రేలియాకు దొరుకుతాడా? టెస్టులు, వన్డేల్లో ఓపెనర్గా ఆడేది ఎవరు?
ప్రత్యేక ముద్ర
ఇన్నింగ్స్ ఆరంభం కాగానే బ్యాటింగ్కు వచ్చామా.. వికెట్ పడగానే పెవిలియన్లో వెళ్లి కూర్చున్నామా.. ఫీల్డర్గా మైదానంలో ఉన్నామా.. అంటే ఉన్నామా అన్నట్లు వార్నర్ ఉండేవాడు కాదు. అలా ఉంటే వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న క్రికెట్లో వేలాది మంది ఆటగాళ్లు వచ్చారు. ఆట నుంచి నిష్క్రమించారు. కానీ ఇందులో కొద్దిమంది మాత్రమే ఆటపై తమదైన ముద్ర వేశారు. ఇలాంటి ఆటగాళ్ల వీడ్కోలు క్రికెట్ ప్రపంచానికి బాధ కలిగిస్తుంది. వార్నర్ కూడా ఇలాంటి కోవకు చెందిన ఆటగాడే. బౌలర్లపై పైచేయి సాధించాలనే కసితో అతని బ్యాటింగ్, ఎలాగైనా బంతిని ఆపాలనే సంకల్పంతో ఫీల్డింగ్.. ఇలా బరిలో దిగితే చాలు జట్టు కోసం వంద శాతం కష్టపడే ఆటగాడు అతను.
తగ్గేదేలే
దూకుడైన ఆటగాడిగా కెరీర్ మొదలెట్టినా.. మధ్యలో వివాదాలు చుట్టుముట్టినా.. అడ్డంకులను దాటి, బాధను వెనక్కినెట్టి వార్నర్ తిరిగి పుంజుకున్నాడు. ముఖ్యంగా బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది పాటు నిషేధం ఎదుర్కొని ఎంతో మానసిక వేదనకు గురయ్యాడు. మళ్లీ ఆడలేనేమోనని కుంగిపోయాడు. కానీ అక్కడితో ఆగిపోకుండా సమస్యలు ఎన్ని వచ్చినా తగ్గేదేలేదంటూ సాగిపోయాడు. పునరాగమనంలోనూ అదరగొట్టి ఆసీస్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా ఎదిగాడు. కంగారూ జట్టు తరపున రెండు వన్డే ప్రపంచకప్ (2015, 2023)లు, ఓ టీ20 ప్రపంచకప్ (2021), ఓ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ (2023) దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆసీస్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (49) చేసిన ఓపెనర్ వార్నరే. ఇప్పుడు టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. అంతర్జాతీయ టీ20ల్లో, ఐపీఎల్ లాంటి లీగ్ల్లో మరికొన్ని రోజులు వార్నర్ను చూసే అవకాశముంది. వార్నర్ లోటును భర్తీ చేసే ఆటగాడి కోసం ఆస్ట్రేలియా వేట మొదలెట్టింది.
ఈ ఆటగాళ్లు
వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు కొందరున్నారు. వీళ్లపై ఆసీస్ కన్నేసింది. టెస్టుల్లో సీనియర్ స్మిత్ను ఓపెనర్గా ఆడించే అవకాశాలనూ కొట్టిపారేయలేం. ఇప్పటికే టీ20ల్లో స్మిత్ ఓపెనర్గా ఆడుతున్నాడు. కానీ సాధారణంగా నాలుగో స్థానంలో ఆడే స్మిత్ను ఓపెనర్గా పంపించి జట్టు కూర్పును డిస్టర్బ్ చేయమని కెప్టెన్ కమిన్స్ అన్నాడు. లబుషేన్ను ఓపెనర్గా ఆడించి, గ్రీన్ను మిడిలార్డర్లోకి తీసుకుచ్చే ఆస్కారమూ ఉంది. లేదంటే గ్రీన్ను ఓపెనర్గానూ పరీక్షించొచ్చు. మరోవైపు మ్యాట్ రెన్షా, మార్కస్ హారిస్, కామెరూన్ బాన్క్రాఫ్ట్.. ఓపెనర్ రేసులో ఉన్నారు. ఆసీస్ దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో 2021 జనవరి నుంచి ఓపెనర్లుగా బాన్క్రాఫ్ట్ 50.72 సగటుతో 2384 పరుగులు, రెన్షా 38.70 సగటుతో 658 పరుగులు, హారిస్ 37.68 సగటుతో 1545 పరుగులు చేశారు. అదే మొత్తం ఫస్ట్క్లాస్ క్రికెట్ చూసుకుంటే 43.04 సగటుతో హారిస్ ముందంజలో ఉన్నాడు. కానీ తన స్థానంలో రెన్షా ఆడితే చూడాలని ఉందని వార్నర్ పేర్కొన్నాడు. ఇక యువ ఆటగాడు విల్ పుకోవ్స్కీని పరిగణించే అవకాశముంది. మరి వార్నర్ ప్లేస్ను ఎవరు రీప్లేస్ చేస్తారో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
-
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ