David Warner: డేవిడ్ భాయ్ ఇన్స్టాలో ఫన్నీ.. గ్రౌండ్లో సీరియస్!
ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) వన్డేలకు వీడ్కోలు పలికేశాడు. ఆసీస్ తరపున 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన వార్నర్ మరో వారం వ్యవధిలో టెస్టులకూ గుడ్బై చెప్పేయనున్నాడు.
బ్యాటుతో బెంబేలెత్తించడం, ఫీల్డింగ్లో మెరుపులా కదలడం... మొత్తంగా మైదానంలో అతడో చిరుత. బౌలర్ వైపు నవ్వుతూ చూశాడా... ఆ తర్వాతి బంతి బౌండరీని ముద్దాడాల్సిందే. ఇదంతా క్రికెటర్ సైడ్. అతనికి ఇంకో సైడ్ కూడా ఉంది. అదే ఇన్స్టా సెలబ్రిటీ. గ్రౌండ్లో చిరుత అయితే... ఇక్కడ ‘స్టార్ హీరో’. ఇదంతా డేవిడ్ భాయ్ అలియాస్ డేవిడ్ వార్నర్ గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. కొత్త సంవత్సరాన్ని షాకింగ్ న్యూస్ (వన్డేలకు రిటైర్మెంట్)తో స్టార్ట్ చేసిన వార్నర్ లైఫ్ రివైండ్ చేద్దామా?
2021 టీ20 ప్రపంచకప్ గుర్తుందా.. ఎక్కువ వన్డే ప్రపంచకప్లను గెలిచిన జట్టుగా ఉన్న ఆసీస్కు అప్పటి వరకు ఒక్కసారి కూడా పొట్టి కప్ దక్కలేదు. ఆ ఎడిషన్లోనూ పెద్దగా అంచనాల్లేకుండానే బరిలోకి దిగింది. చాలా మంది మాజీ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్ను ఆడించడం ఎందుకు? అనే ప్రశ్నలు.. అప్పుడు వార్నర్ పెద్దగా ఫామ్లో లేడు. అంతకుమందే ముగిసిన ఐపీఎల్ 2021 సీజన్లో ఎస్ఆర్హెచ్ తరఫున 8 మ్యాచుల్లో 195 పరుగులే చేశాడు. కెప్టెన్సీ పోయింది. చివరికి తుది జట్టులోనూ స్థానం దక్కలేదు. ఇలాంటి అవమానాలు, విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రత్యర్థులు కూడా ‘వార్నర్ ఏం ఆడతాడులే’ అని తేలిగ్గా తీసుకున్నారు. కానీ, ఆసీస్ జట్టు మాత్రం వార్నర్పై నమ్మకం ఉంచింది. ఆ వరల్డ్ కప్లో డేవిడ్ వార్నర్ విశ్వరూపం చూపించాడు. 7 మ్యాచుల్లో 289 పరుగులు చేసి.. రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఫైనల్లోనూ కీలకమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ఇటీవల వన్డే ప్రపంచకప్ను గెలవడంలోనూ ముఖ్యభూమిక పోషించిన వార్నర్ 11 మ్యాచుల్లో 535 పరుగులు చేశాడు. ఆరోసారి వరల్డ్ కప్ను నెగ్గిన తర్వాత వన్డే కెరీర్కు వీడ్కోలు పలకడం సముచితంగా ఉంటుందని డేవిడ్ వార్నర్ తన ప్రకటనలో వెల్లడించాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీకి (2025లో) ఓపెనర్గా అవసరమైతే జట్టులోకి వచ్చేస్తానని చిన్న హింట్ ఇచ్చాడు.
అదే ఉత్సాహం..
తాజాగా పాకిస్థాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లోనూ డేవిడ్ వార్నర్ ఆటతీరును చూస్తే అతడికి 37 ఏళ్లు ఉంటాయంటే ఎవరూ నమ్మలేరు. మైదానంలో చురుగ్గా ఉండే వార్నర్ వికెట్ల మధ్య పరుగు తీయడంలో కుర్రాళ్లకు ఏమాత్రం తగ్గడు. టెస్టు కెరీర్కూ ముగింపు పలుకుతానని ఈ సిరీస్ ముందే ప్రకటించిన వార్నర్ తొలి మ్యాచ్లో పాక్ బౌలింగ్ను ఉతికారేశాడు. భారీ సెంచరీ సాధించి తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించాడు. సిడ్నీ వేదికగా జరగనున్న మూడో టెస్టులోనూ సెంచరీ సాధించి ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు, జట్టు సహచరులు వార్నర్ నుంచి ఆశిస్తున్నారు. దూకుడుగా ఆడే వార్నర్ టెస్టుల్లో ఎలా రాణించావని ఓ సందర్భంలో ప్రశ్నిస్తే.. ‘నువ్వు టీ20ల్లో కంటే టెస్టు క్రికెటర్గా అత్యుత్తమం’ అని సెహ్వాగ్ చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటానని వార్నర్ వెల్లడించాడు. పాక్తో టెస్టు సిరీస్కు ముందు కూడా ‘సుదీర్ఘ ఫార్మాట్’లో ఫామ్లో లేడని విమర్శలు వచ్చాయి. కానీ, తొలి టెస్టులోనూ సెంచరీతో వారి నోళ్లు మూయించాడు.
ఆ ఒక్కటి దుమారం రేపింది..
డేవిడ్ వార్నర్ తన కెరీర్లో ఇప్పటి వరకు 111 టెస్టులు ఆడాడు. పాకిస్థాన్తో చివరి మ్యాచ్ 112వ టెస్టు. 161 వన్డేలు, 99 టీ20లు ఆడాడు. మొత్తం 18వేలకుపైగా పరుగులు సాధించాడు. ఇందులో 49 శతకాలున్నాయి. ఇంత ఘన చరిత్ర ఉన్న డేవిడ్ వార్నర్ కెరీర్లో మాయని మచ్చ కూడా ఉంది. అదే 2018లో ‘బాల్ టాంపరింగ్ వివాదం’. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో బాల్ను సాండ్ పేపర్తో రుద్దారనే అభియోగాలతో స్మిత్ కెప్టెన్సీ కోల్పోగా.. వార్నర్పై వేటు కూడా పడింది. సంవత్సరం తర్వాత (2019) వన్డే ప్రపంచ కప్ జట్టులో స్థానం సంపాదించాడు. తొలి మ్యాచ్లోనే అఫ్గాన్పై కీలక ఇన్నింగ్స్తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటిచెప్పాడు. కానీ, జాతీయ జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్సీ చేపట్టే అవకాశం మాత్రం ‘బాల్ టాంపరింగ్’తో చేజారింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగానూ ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్పై దురుసుగా ప్రవర్తించినందుకు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం ఎదుర్కొన్నాడు. తన భార్య కార్డిస్ పట్ల దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ అసభ్యంగా మాట్లాడాడని ఆరోపణలతో అతడిపై వార్నర్ దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో ఐసీసీ అతడిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది.
డేవిడ్ భాయ్.. ఐపీఎల్.. ఇన్స్టాగ్రామ్
ఆసీస్ తరఫున ఎన్ని అంతర్జాతీయ మ్యాచ్లాడినా.. భారత అభిమానులకు కూడా వార్నర్ దగ్గర కావడానికి రెండు కారణాలు. అవి ఐపీఎల్, ఇన్స్టాగ్రామ్. మరీ ముఖ్యంగా తెలుగు అభిమానులకు ‘డేవిడ్ భాయ్’గా గుర్తుండిపోతాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని వీడినప్పుడు చాలా మంది అభిమానులు బాధపడ్డారు. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల క్యారెక్టర్లను అనుకరిస్తూ కుటుంబంతో కలిసి ఇన్స్టా రీల్స్ రూపంలో దర్శనమిచ్చేవాడు. ‘పుష్ప’లో అల్లు అర్జున్, ‘పోకిరి’లో మహేశ్ డైలాగ్స్తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించాడు. తన కుమార్తెలు, భార్యతో కలిసి చేసిన వీడియోలను భారత అభిమానులు కూడా ఆదరించారు.
ఐపీఎల్లో (2016) సన్రైజర్స్ హైదరాబాద్ను వార్నర్ విజేతగా నిలిపాడు. గత సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ సారథిగా డేవిడ్ వార్నర్ను చూశాం. వచ్చే ఎడిషన్లోనూ అదే దిల్లీ తరఫున బరిలోకి ఆడనున్నాడు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను మూడేళ్లపాటు అందుకున్నాడు. సారథ్య బాధ్యతలను రిషభ్ పంత్ (అందుబాటులోకి వస్తే) తీసుకుంటే వార్నర్ మరింత దూకుడుగా ఆడటం ఖాయం. ఇప్పటి వరకూ 176 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన వార్నర్ 6,397 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలున్నాయి. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ డేవిడ్ వార్నర్. వన్డే రిటైర్మెంట్ తర్వాత చేసిన ప్రకటనలో.. లీగ్ క్రికెట్కు అందుబాటులో ఉంటానని చెప్పడంతో అతడి నుంచి ఈసారి భారీ ఇన్నింగ్స్లు చూసే అవకాశం లేకపోలేదు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదరగొట్టిన హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై విజయం
సొంత గడ్డపై హైదరాబాద్ అదరగొట్టింది. రాజస్థాన్తో చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. -
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. జట్టు సభ్యుల ఎంపికపై వస్తోన్న విమర్శలు, సందేహాలపై వివరణ ఇచ్చారు. -
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
ధోనీని రనౌట్ చేసిన వికెట్ కీపర్ జితేశ్ శర్మపై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. అతడి ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు. -
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట తీరుపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా స్ట్రైక్రేట్ ఉండటం లేదని కొందరు మాజీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాటిపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. -
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
అదరగొట్టిన హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై విజయం
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!