David Warner: వార్నర్ తగ్గేదేలే.. ప్రపంచకప్లో అదరగొడుతున్న ఆసీస్ ఓపెనర్
డేవిడ్ వార్నర్ ఆటతీరుపై ఇటీవల సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ప్రపంచకప్ అంటే చాలు అతడు చెలరేగిపోతాడు. పాకిస్థాన్పై అతడు చెలరేగి ఆడిన తీరే ఇందుకు నిదర్శనం.
ఫామ్ లేదు.. గాయాలు బాధిస్తున్నాయి.. పరుగులు చేయడం లేదు.. వయసు మీద పడుతోంది.. ఇక అతని పని అయిపోయిందని ఎన్నో వ్యాఖ్యలు. ఇంకా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారంటూ విమర్శలు. వీడ్కోలు పలికితే మంచిదనే ఉచిత సలహాలు. కానీ అతను కుంగిపోలేదు. ఎక్కడా ఆగిపోలేదు. విమర్శలనే ప్రేరణగా తీసుకుని కసిగా పరుగుల వేటలో సాగుతున్నాడు. ఫీనిక్స్ పక్షిలా ఎగిరాడు. అతనే.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner). ఈ నెల 27న 37వ పడిలో అడుగుపెట్టనున్న ఈ విధ్వంసకర ఆటగాడు వన్నె తగ్గని బ్యాటింగ్తో అలరిస్తున్నాడు. ఈ ఏడాది యాషెస్ సిరీస్తోనే కెరీర్ ముగిసిందని.. టీ20ల్లోనూ వరస వైఫల్యాలున్నాయని.. వన్డేల్లోనూ భారీ ఇన్నింగ్స్ లేవని.. ఇలా వార్నర్పై ఎంతోమంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ వీటన్నింటికీ తన బ్యాటింగ్తోనే అతను సమాధానం చెబుతున్నాడు.
ఆధునిక వన్డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న వార్నర్.. ఈ ప్రపంచకప్ ఆడాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకవేళ ఆటకు వీడ్కోలు పలికితే అది ఈ ప్రపంచకప్ తర్వాతే అని స్పష్టం కూడా చేశాడు. ఇప్పుడు టోర్నీలో అడుగుపెట్టడమే కాకుండా అద్భుత బ్యాటింగ్తో చెలరేగుతున్నాడు. నిరుడు 26 వన్డేల్లో 45 సగటుతో 1170 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 13 మ్యాచ్ల్లో 47.53 సగటుతో 618 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో ఆ తర్వాత భారత్తో సిరీస్లో రాణించి సరిగ్గా ప్రపంచకప్ ముందు అతను జోరందుకున్నాడు. దక్షిణాఫ్రికాపై ఓ శతకం, అర్ధసెంచరీ సాధించాడు. భారత్తో వన్డే సిరీస్లో వరుసగా మూడు అర్ధశతకాలు బాదాడు. ఇప్పుడదే జోరును ప్రపంచకప్లోనూ కొనసాగిస్తున్నాడు. భారత్పై 41 పరుగులు చేశాడు. గత రెండు మ్యాచ్ల్లో పెద్దగా రాణించలేకపోయినా పాకిస్థాన్పై భారీ ఇన్నింగ్స్తో ఆ లోటు తీర్చేశాడు. క్రీజులో కుదురుకుంటే తానెంత ప్రమాదకర బ్యాటర్నోనని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు.
ప్రపంచకప్పై ప్రేమ..
ప్రపంచకప్ అంటే చాలు వార్నర్ చెలరేగిపోతాడు. ఇప్పటికే వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు (19 ఇన్నింగ్స్) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయిదు శతకాలతో అత్యధిక ప్రపంచకప్ సెంచరీల వీరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 2021 టీ20 ప్రపంచకప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచి ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2015లో ఆస్ట్రేలియా వన్డే విశ్వవిజేతగా నిలిచిన టోర్నీలో వార్నర్ ఆసీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడి (8 మ్యాచ్ల్లో 345 పరుగులు)గా నిలిచాడు. ఆసీస్ సెమీస్లో నిష్క్రమించిన 2019 ప్రపంచకప్లోనూ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు (10 మ్యాచ్ల్లో 647 పరుగులు) అతడే. ఈ సారి వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటములతో ప్రపంచకప్ను ఆసీస్ మొదలెట్టింది. గత మ్యాచ్లో లంకపై గెలిచింది. ఇప్పుడు పాకిస్థాన్పై వార్నర్ 163 పరుగుల అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించడమే కాదు.. మెగా టోర్నీలో మానసిక స్థైర్యాన్ని కూడా కలిగించాడనడంలో సందేహం లేదు. వార్నర్ ఒక్కసారి కుదురుకున్నారంటే అతని విధ్వంసానికి ఎంతటి బౌలరైనా బలి కావాల్సిందే. అన్ని రకాల షాట్లతో మైదానంలోని అన్ని వైపులా అలవోకగా షాట్లు ఆడేస్తాడు. సిక్సర్లు కొట్టేస్తాడు. వీర విహారం చేస్తూ బంతి అంతు చూస్తాడు.
పాకిస్థాన్ అంటే కూడా..
వార్నర్కు పాకిస్థాన్ ప్రియమైన ప్రత్యర్థి. వన్డేల్లో ఆ జట్టుపై వరుసగా నాలుగు శతకాలు బాదేశాడు. సవాళ్లను ఎదుర్కోవడం అతనికి ఇష్టం. అడ్డంకులను దాటి ముందుకు సాగడం అతని నైజం. ఎడమ చేతి వాటం బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతాడని అశ్విన్కు పేరుంది. అశ్విన్ బౌలింగ్లో వార్నర్ చాలా సార్లే ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ ముందు భారత్తో సిరీస్లో మొహాలీలో రెండో వన్డేలో అశ్విన్ను ఎదుర్కొనేందుకు అతను కుడి చేతి వాటం బ్యాటర్గా మారిపోయాడు. ఇలా ఎప్పటికప్పుడూ తనను తాను మెరుగుపర్చుకుంటూ.. తన ఆటతీరును మార్చుకుంటూ సాగుతున్నాడు. 2018 బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తిరిగి జట్టులోకి వచ్చి అదరగొడుతున్నాడు. భారత్లోని పిచ్లు అతనికి కొట్టిన పిండే. ఐపీఎల్లో ఆడిన అనుభవం అతనికి ఉపయోగపడుతోంది. అలాగే వార్నర్ మనోడేనని అభిమానుల్లో ప్రేమ. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడటమే కాదు.. కెప్టెన్గా ట్రోఫీ అందించడమే కారణం. పైగా తెలుగు సినిమాల పాటలకు, డైలాగ్లకు వార్నర్ వీడియోలు చేస్తుంటాడు. మన హీరోల గెటప్పుల్లో తన ముఖంతో కనిపిస్తాడు. ఇప్పుడు పాకిస్థాన్పై సెంచరీ తర్వాత కూడా తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్లా సంజ్ఞ చేశాడు. ప్రపంచకప్లో ఇదే దూకుడుతో సాగుతానని చెప్పకనే చెప్పాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81