PM Modi meets Olympions: ఒలింపిక్‌ హీరోలతో మర్చిపోలేని రోజు.. ప్రధాని వీడియో వైరల్‌

Eenadu icon
By Sports News Team Published : 18 Aug 2021 14:01 IST
Ee
Font size
  • A
  • A+
  • A++

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు 16న ఒలింపిక్స్‌ క్రీడాకారులతో మాట్లాడారు. తన నివాసంలో వారికి ఆతిథ్యం ఇచ్చారు. క్రీడాకారులను ఆత్మీయంగా పలకరించారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా మోదీ ట్వీట్‌ చేశారు. ‘మన ఒలింపిక్స్‌ హీరోలతో మర్చిపోలేని రోజు’ అని వ్యాఖ్యను జతచేశారు.

పతకం గెలిచి వచ్చాక సింధుకు ఐస్‌క్రీం తినిపిస్తానని పీఎం మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్టే ఆయన ఆమెకు ఐస్‌క్రీం తినిపించారు. ఇక స్వర్ణ పతక విజేత, బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రాతో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. అతడికి చుర్మా తినిపించారు. పురుషులు, మహిళల హాకీ జట్లతో ఆత్మీయంగా గడిపారు. రజత పతక విజేత మీరాబాయి చాను, బాక్సర్‌ లవ్లీనా, మేరీకోమ్‌తో పలు విషయాలు పంచుకున్నారు.

ముఖ్యంగా ఆటగాళ్ల కష్టసుఖాలు, అనుభవాలు, ఫిట్‌నెస్‌, ఆరోగ్యం, ప్రేరణ, క్రీడల అభివృద్ధికి సూచనలను మోదీ తెలుసుకున్నారు. ఆయన సైతం తన అనుభవాలను వివరించారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారిన ఆ వీడియో మీ కోసం..!



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    జిల్లా వార్తలు

    లైవ్ టీవీ