WPL 2023: వచ్చే ఏడాది నేనూ సెలెక్షన్కు వెళ్తా.. అయితే: బాలీవుడ్ నటి
మహిళా క్రికెట్కు క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) జరుగుతుండటంతో సంపాదన కూడా వస్తోంది. దీంతో క్రికెట్ను కెరీర్గా మలుచుకోవడానికి అమ్మాయిలకు అవకాశం కల్పిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడంతా మహిళా క్రికెట్ (Cricket) ఫీవర్.. తొలిసారి బీసీసీఐ ఆధ్వర్యంలో మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) జరుగుతోంది. దీంతో కొత్తతరం చిన్నారులు క్రికెట్ను కెరీర్గా మలుచుకోవడానికి ఈ లీగ్ అక్కరకొస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. సంపాదనతోపాటు క్రేజ్ను ప్లేయర్లు దక్కించుకున్నారు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లతో ఆడటం వల్ల స్థానిక ప్లేయర్లకు తప్పకుండా ప్రయోజనం చేకూరుతుంది. అమ్మాయిలు క్రికెట్ను కెరీర్గా తీసుకోవడానికి ముందుకు వస్తారు. అయితే, తాజాగా ఓ బాలీవుడ్ నటి కూడా వచ్చే ఏడాది డబ్ల్యూపీఎల్ సెలెక్షన్కు వెళ్తానని చెప్పింది. అయితే, ఇదేదో కేవలం మాటలతోనే కాకుండా.. ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం విశేషం. కానీ, ఇక్కడ చిన్న కండీషన్ పెట్టిందండోయ్.. ఇంతకీ ఆమె ఎవరంటే..?
బాలీవుడ్ నటి సైయామి ఖెర్ (Saiyami Kher).. తెలుగులోనూ సాయిధరమ్ తేజ్ తొలి సినిమా ‘రేయ్’ (Rey) హీరోయిన్. నాగార్జునతో వైల్డ్ డాగ్ చిత్రంలోనూ నటించింది. హిందీ, మరాఠీ భాషల్లోనూ సినిమాలు చేసింది. తాజాగా తన స్నేహితులతో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ‘‘పాఠశాల స్థాయిలో క్రికెట్ తప్ప ప్రతి గేమ్ను ఆడేదాన్ని. ఇప్పుడు 11 మందిని జట్టుగా కూడగట్టుకొని ఆడటం, మహిళల ప్రీమియర్ లీగ్ చూడటం ఆనందంగా ఉంది. నా చిన్ననాటి కలను నిజం చేసుకొనేందుకు.. ఎలాంటి షూటింగ్లు లేకపోతే వచ్చే ఏడాది డబ్ల్యూపీఎల్ సెలెక్షన్ కోసం వెళ్తా’’ అని పోస్టు పెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం