Manuguru BRS Office: భారత రాష్ట్ర సమితి కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి
మణుగూరులో ఉద్రిక్తత

ఫర్నిచర్ని బయట పడేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
మణుగూరు పట్టణం, మణుగూరు సాంస్కృతికం- న్యూస్టుడే: భద్రాద్రి జిల్లా మణుగూరులో కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం ఉదయం పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలోకి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు ప్రవేశించారు. అందులోని కరపత్రాలు, డైరీలు, జెండాలు, ఫర్నిచర్, కంప్యూటర్ బయటకు తీసుకొచ్చి నిప్పుపెట్టారు. అనంతరం నినాదాలు చేస్తూ కార్యాలయంపై ఉన్న ‘తెలంగాణ భవన్’ అనే పేరును చెరిపేసి దానిపై ‘ఇందిరమ్మ భవన్’ అని రాశారు. అక్కడ కాంగ్రెస్ జెండాలను ఎగురవేసి ‘ఇందిరమ్మ భవన్’ అనే ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. ఆ సమయంలో కార్యాలయంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కార్యకర్త శ్రీనుపై దాడికి పాల్పడటంతో ఆయన కంటికి గాయమైంది. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకొంటుండగా అక్కడికి భారీగా చేరుకున్న భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కొత్తగూడెం ఓఎస్డీ నరేందర్, డీఎస్పీ రవీంద్రారెడ్డి ప్రత్యేక బలగాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రజల రక్షణార్థం 144 సెక్షన్ విధిస్తూ తహసీల్దార్ నరేశ్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఇరుపార్టీల వారు నిష్క్రమించారు.
నా సొంత భవనం: రేగా కాంతారావు
ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సాయంత్రం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మాట్లాడారు. ‘భారత రాష్ట్ర సమితి కార్యాలయం నా సొంత భవనం. కాంగ్రెస్ శ్రేణుల దాడిని ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాపై దాడులకు కుట్ర పన్నారు. డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్) నిధుల లెక్క చెప్పాలని ప్రశ్నించినందుకే కార్యాలయంపై దాడి చేశారు. ఆఫీసు వారిదని ఆధారాలు చూపిస్తే ఖాళీ చేసేందుకు సిద్ధం’ అని తెలిపారు. ఈ ఘటనపై మణుగూరు డీఎస్పీ రవీంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు.

పార్టీ కార్యాలయంపై ఇందిరమ్మ భవన్ అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
అది కాంగ్రెస్ కార్యాలయమే: పాయం వెంకటేశ్వర్లు
ఇదే విషయమై కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడారు. ‘లేని ఆరోపణలు చేస్తే రేగా కాంతారావుకు గుణపాఠం చెబుతాం. గతంలో కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బు జమచేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించడంతో పాటు, ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. తర్వాత భారత రాష్ట్ర సమితిలో చేరి.. కార్యాలయాన్ని కబ్జా చేశారు. మా శ్రేణులు స్వాధీనం చేసుకునే క్రమంలో.. భారత రాష్ట్ర సమితి నాయకులు దుర్భాషలాడటంతో వివాదం నెలకొంది. రేగా ఆరోపణలు అవాస్తవం. నూటికి నూరుశాతం ఇది కాంగ్రెస్ కార్యాలయం’ అని స్పష్టం చేశారు.
దాడులకు భయపడేది లేదు: కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: మణుగూరు భారత రాష్ట్ర సమితి కార్యాలయంపై దాడి ఘటనను ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదివారం ఓ ప్రకటనలో ఖండించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. వీటికి ముగింపు పలికే సమయం తొందరలోనే ఉంది. మణుగూరు పార్టీ శ్రేణులకు 60 లక్షల మంది భారత రాష్ట్ర సమితి సభ్యులు అండగా ఉంటారు’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేగా కాంతారావుతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు.
ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న అసంతృప్తిని చూసి.. ఆ పార్టీ నాయకుల్లో అసహనం పెరిగిందని భారత రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రేగా కాంతారావు ప్రైవేటు ఆస్తిని కొనుక్కుని పార్టీ ఆఫీసుగా మార్చుకున్నారు. దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ధర్మపురి ఆలయాన్నిసమగ్రంగా అభివృద్ధి చేస్తాం
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. - 
                                    
                                        

ఏడు క్వింటాళ్ల పరిమితి నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి
ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. - 
                                    
                                        

నెలాఖరులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. రూ.123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారంలో నిర్లక్ష్యం వద్దు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ నిర్లక్ష్యం చూపించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. - 
                                    
                                        

వ్యవసాయ విద్యలో సంయుక్త బీఎస్సీ కోర్సు
దేశంలో తొలిసారిగా.. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ కోర్సును సంయుక్తంగా నిర్వహించేందుకు తెలంగాణ అగ్రి వర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్టర్న్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. - 
                                    
                                        

మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలోని 3 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా.. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విన్నవించారు. - 
                                    
                                        

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించండి
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కార్డుల జారీపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఉద్యోగుల ఐకాస (టీజీఈజాక్) కోరింది. - 
                                    
                                        

ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. మహారాష్ట్రకు సంబంధించి ఇలాంటి కేసుపైనే ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం... - 
                                    
                                        

ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే!
తెలంగాణ హైకోర్టులో తనను జడ్జిగా నియమించాలంటూ జి.వి.సర్వన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. - 
                                    
                                        

కేకు.. ఆలోచన కేక
ఇక్కడ కేకులపై కనిపిస్తున్న చిత్రాలు హైదరాబాద్లోని ట్రాఫిక్ జంక్షన్లవి. మరి ఇలా కేకులపై ఎందుకు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా? నగరంలో సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కూడళ్లను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ... - 
                                    
                                        

రైల్వే స్టేషన్లే విద్యుత్ కేంద్రాలు
రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారాలపై లైట్లు, ఫ్యాన్లు, అనౌన్స్మెంట్ సిస్టమ్, టికెట్ కౌంటర్లు.. ఇలా అన్నింటికి కలిపి పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 55 రైల్వేస్టేషన్లు, కార్యాలయ భవనాలకు ఇప్పుడు ఆ శక్తి సూర్యుడి నుంచే అందుతోంది. - 
                                    
                                        

ఓటు వేటలో నాగసాధువులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు మద్దతుగా వారణాసి నుంచి వచ్చిన 11 మంది సోమవారం ప్రచారం నిర్వహించారు. - 
                                    
                                        

రామచక్కని సీతమ్మకు.. చక్కనైన గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన శంకర్నారాయణ-రాజ్యలక్ష్మి అనే దంపతులు రెండ్రోజుల కిందట రూ.40 లక్షల విలువైన రజత గజ వాహనాన్ని అందజేశారు. - 
                                    
                                        

కడలుంగీ.. రఘునాథపురం టు ఉగాండా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో మరమగ్గాలపైన రూపుదిద్దుకుంటున్న కడలుంగీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా దేశానికి సరఫరా అవుతోంది. - 
                                    
                                        

హైకోర్టు ఉద్యోగిని తెలంగాణకు తిరిగి కేటాయించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన పీవీ సతీష్కుమార్ అనే హైకోర్టు ఉద్యోగిని తిరిగి తెలంగాణకు కేటాయించడానికి నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తంచేసింది. - 
                                    
                                        

జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం
వ్యాపార విస్తరణలో భాగంగా మరో జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. నాగ్పుర్లోని కేంద్ర గనులశాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం.. - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లు.. ఏడు క్వింటాళ్లకు కుదింపు
భారత పత్తి సంస్థ(సీసీఐ) తాజాగా మరో కఠిన నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఎకరాకు సగటున 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే నిబంధనలను సోమవారం నుంచి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయటం విస్మయానికి గురిచేసింది. - 
                                    
                                        

వరద సహాయక చర్యలపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీవర్షాలకు నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకోవడానికి తీసుకున్న సహాయక చర్యలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. - 
                                    
                                        

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన డిసెంబరు 19 నుంచి
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన(38వ) డిసెంబరు 19 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ప్రకటించింది. - 
                                    
                                        

సగం బకాయిలిచ్చే వరకూ కళాశాలల బంద్
రాష్ట్రంలోని ఉన్నత విద్యా కళాశాలలకు ప్రభుత్వం బకాయిపడిన ఫీజు రీయింబర్స్మెంట్లో 50 శాతం.. అంటే రూ.5వేల కోట్లు చెల్లించేవరకు కళాశాలల బంద్ కొనసాగుతుందని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల సమాఖ్య తేల్చి చెప్పింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


