Gas Subsidy: ప్రతి సంవత్సరం ఈ-కేవైసీ తప్పనిసరి

Eenadu icon
By Telangana News Desk Updated : 31 Oct 2025 05:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కేంద్ర ప్రభుత్వ గ్యాస్‌ సబ్సిడీ కోసం..

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ గ్యాస్‌ సబ్సిడీ కోసం డొమెస్టిక్‌ ఎల్పీజీ వినియోగదారులు ప్రతి సంవత్సరం ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరని ఆయిల్‌ కంపెనీలు స్పష్టం చేశాయి. గ్యాస్‌ వినియోగదారులు తమ కంపెనీ (ఇండియన్‌ ఆయిల్, హెచ్‌పీ, భారత్‌ పెట్రోలియం) మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ-కేవైసీ (బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ) చేయించుకోవచ్చు. గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఆఫీస్‌కు వెళ్లి.. లేదంటే సిలిండర్‌ డెలివరీ చేసే బాయ్‌ వద్ద ఉండే యాప్‌ ద్వారా కూడా ఈ ప్రక్రియను      పూర్తి చేయవచ్చు. ఈ సేవలు ఉచితంగా అందుతాయి. పూర్తి వివరాల కోసం http://www.pmuy.gov.in/e-kyc.html వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి ఈ-కేవైసీ చేయించడం తప్పనిసరి. ఏడాదికి గరిష్ఠంగా 9 సిలిండర్లకు కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. అయితే 8, 9వ రీఫిల్‌ సబ్సిడీని బయోమెట్రిక్‌ ధ్రువీకరణ పూర్తయ్యేంత వరకు కేంద్రం నిలిపివేస్తుంది. మార్చి 31లోపు ఈ-కేవైసీ చేయించుకుంటే ఆ సబ్సిడీని తిరిగి చెల్లిస్తారు. లేదంటే ఆ రాయితీ శాశ్వతంగా రద్దవుతుంది. బయోమెట్రిక్‌ ధ్రువీకరణ చేయకపోయినా గ్యాస్‌ సరఫరా నిలిచిపోదు. కానీ సబ్సిడీ రాదు. యాప్, డిస్ట్రిబ్యూటర్‌ ఆఫీస్, డెలివరీ బాయ్‌.. మూడింటిలో ఏదో ఒక పద్ధతిని ఎంచుకుని ఈ-కేవైసీ పూర్తిచేసుకోవాలని తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు.

Tags :
Published : 31 Oct 2025 04:18 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని