రైల్వే ట్రాక్షన్‌ వ్యవస్థ అప్‌గ్రేడ్‌కు రూ.188 కోట్లు

Eenadu icon
By Telangana News Desk Published : 30 Oct 2025 04:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ప్రతిపాదనలకు రైల్వే శాఖ ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలోని పగిడిపల్లి-గుంటూరు, మోటమర్రి-విష్ణుపురం రైల్వే సెక్షన్లలో విద్యుత్‌ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ బుధవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును రూ.188.31 కోట్ల వ్యయంతో చేపడతారు. ప్రస్తుతం ఈ రెండు మార్గాల్లో 25 కేవీ విద్యుత్‌ వ్యవస్థ ఒక్కోటి ఉంది. వీటిని రెండు 25 కేవీ విద్యుత్‌ వ్యవస్థలుగా అభివృద్ధి చేయనున్నారు.

రైళ్ల వేగం పెంచడానికి ఆస్కారం

పగిడిపల్లి-గుంటూరు, మోటమర్రి-విష్ణుపురం మధ్య దాదాపు 337 రూట్‌ కిలోమీటర్లు ఉంటుంది. ఇవి ప్రస్తుతం సింగిల్‌ లైన్‌ మార్గాలు. ఈ మార్గాల్లో ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌ సిస్టమ్‌ను మెరుగుపరిస్తే అధిక వోల్టేజ్‌తో విద్యుత్‌ సరఫరా అవుతుంది. తద్వారా ప్రస్తుతం తిరిగే రైళ్లను అధిక వేగంతో, ఎక్కువ సామర్థ్యంతో నడపడానికి వీలవుతుంది.

రద్దీ మార్గానికి ప్రత్యామ్నాయం బలోపేతం

సికింద్రాబాద్‌-విజయవాడ చాలా రద్దీగా ఉండే రైల్వే మార్గం. పగిడిపల్లి-గుంటూరు, విష్ణుపురం-మోటమర్రి సెక్షన్‌... సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య ప్రత్యామ్నాయ మార్గంగా పనిచేస్తుంది. ఈ రెండు మార్గాల్లో మరిన్ని రైళ్లను నడపడానికి పగిడిపల్లి-గుంటూరు, విష్ణుపురం- మోటమర్రి సెక్షన్‌లో ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌ సిస్టమ్‌ను మెరుగుపరచాలని నిర్ణయించాం. ఈ సెక్షన్‌ను రానున్న మూడు సంవత్సరాల్లో రూ.188 కోట్లతో మెరుగుపరుస్తాం.

అశ్వినీ వైష్ణవ్, రైల్వే మంత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు