కాంగ్రెస్‌ ఆపద మొక్కులు

Eenadu icon
By Telangana News Desk Published : 31 Oct 2025 04:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

‘ఎక్స్‌’లో కేటీఆర్‌ విమర్శలు

ఈనాడు, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆపదమొక్కులు మొక్కుతోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ‘ఎక్స్‌’లో కాంగ్రెస్‌పై ఆయన గురువారం విమర్శలు చేశారు. ‘‘ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తోంది. జూబ్లీహిల్స్‌ ఎన్నిక కోసం సినీ కార్మికులకు వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌ వీధుల్లో హడావుడిగా తిరగడం వంటివి... ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనం. ప్రజలు పదునైన ప్రశ్నలతో మంత్రులను నిలదీస్తున్నారు. మంత్రులు వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ చెప్పే మాయ మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ను కోల్పోయేలా చేసినప్పుడు మాత్రమే.. 2023లో వారు ఇచ్చిన ఆరు హామీలు, 420 వాగ్దానాల అమలును ప్రారంభిస్తుంది. అందుకు ఈ ఎన్నికే సరైన వేదిక’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని