సంక్షిప్త వార్తలు(5)
తెలంగాణ ఇంటర్ బోర్డు నమూనా అనుసరించదగింది 
కమాండ్ కంట్రోల్ సెంటర్పై పలు దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులు 

కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి వివిధ బోర్డుల ప్రతినిధులకు వివరిస్తున్న వసుంధర
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ వార్షిక, ప్రయోగ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంపునకు, కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఇతర అంశాలను ఇంటర్ బోర్డు నుంచే పర్యవేక్షించేందుకు నెలకొల్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను నేపాల్, భూటాన్ దేశాలు, కర్ణాటక, కశ్మీర్, ఏపీ తదితర రాష్ట్రాల బోర్డుల ఉన్నతాధికారులు, ఎన్సీఈఆర్టీ ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ‘‘తెలంగాణ బోర్డు నమూనా దేశంలోని రాష్ట్రాలు, పొరుగు దేశాలు కూడా అనుసరించదగింది. మా దేశాలు, రాష్ట్రాల బోర్డుల్లో ఇలాంటి సాంకేతిక వ్యవస్థలను అమలు చేస్తే బాగుంటుంది. మావద్ద ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటే తెలంగాణ ఇంటర్ బోర్డు సహకారం తీసుకుంటాం’’ అని అన్నారు. కార్యక్రమంలో బోర్డు సంయుక్త కార్యదర్శులు వసుంధర, భీమ్సింగ్, సిలబస్ నిపుణుడు రమణారావు, అకడమిక్ గైడెన్స్ అధికారి జయమణి తదితరులు పాల్గొన్నారు.
‘న్యాయవాదుల సంక్షేమ నిధి’లో.. 35-65 ఏళ్ల వారికి ఒక్క అవకాశం 
బార్ కౌన్సిల్ నిర్ణయం 
ఈనాడు, హైదరాబాద్: న్యాయవాదుల సంక్షేమ నిధి (అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్)లో చేరడానికి 35 నుంచి 65 ఏళ్లవారికి ఒక్క అవకాశం కల్పించాలని బార్ కౌన్సిల్ తీర్మానించింది. న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో నమోదయ్యే సమయంలో రూ.3,500 వసూలుచేసి ఈ నిధిలో సభ్యత్వం కల్పిస్తారు. అయితే న్యాయవాద వృత్తిలో ఉంటూ ఇంతవరకు సభ్యత్వం లేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నిధిలో చేరినవారికి రూ.10 లక్షల బీమా, వైద్య సౌకర్యాలు వంటి ప్రయోజనాలుంటాయి. అయితే చాలామంది వీటిని పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో 35-65 ఏళ్లవారికి ఒక్క అవకాశం కల్పించాలని బార్ కౌన్సిల్ తీర్మానించింది. ఈ మేరకు నవంబరు 1 నుంచి డిసెంబరు 31లోగా ఫీజు చెల్లించాలని బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
లింగంపల్లిలో మరో 5 రైళ్లకు హాల్టింగ్
శేరిలింగంపల్లి, న్యూస్టుడే: ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే స్టేషన్లో.. ఈ నెల 1(శనివారం) నుంచి మరో ఐదు రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించారు. వాటిలో రాజ్కోట్, పోర్బందర్, పద్మావతి, హుస్సేన్ సాగర్, శతాబ్ది ఎక్స్ప్రెస్లు ఉన్నాయి.
ఎక్సైజ్శాఖ నూతన బ్యాచ్కు 3 నుంచి శిక్షణ
ఈనాడు, హైదరాబాద్: ఆబ్కారీశాఖకు కొత్తగా ఎంపికైన అధికారులకు ఈనెల 3 నుంచి శిక్షణ ఇచ్చేందుకు బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటీవలే టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఎంపికైన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎస్సైలు శనివారం అకాడమీలో రిపోర్ట్ చేయనున్నారు.
‘ఇగ్నో’ ప్రాంతీయ కేంద్రం నూతన ఆర్డీగా రాజు
ఈనాడు, హైదరాబాద్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం నూతన రీజనల్ డైరెక్టర్(ఆర్డీ)గా బొల్లా రాజు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రంలో సుదీర్ఘకాలంపాటు సేవలందించిన సీనియర్ రీజినల్ డైరెక్టర్ కందుకూరి రమేశ్ శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు ఆయనను సత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

మైనింగ్ అక్రమ రవాణా ఆపేవారే లేరా..!
మైనింగ్ రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల.. లోపల.. అనేక ‘మార్గాల్లో’ అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు. - 
                                    
                                        

ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్బాక్స్.. ఐ-ఎలర్ట్
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా బస్సుల్లో ఐ-ఎలర్ట్ పరికరాన్ని అమరుస్తున్నారు. - 
                                    
                                        

ఓవర్ లోడ్.. ఓవర్ స్పీడ్!
మైనింగ్ వాహనాలు నడిపే విషయంలో నిబంధనలున్నా.. కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వాటిని పాటించాల్సిన యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. అధికారయంత్రాంగంలోని కొందరు షరా ‘మామూలు’గా చూసీచూడనట్లు ఉంటున్నారు. - 
                                    
                                        

ధర్మపురి ఆలయాన్నిసమగ్రంగా అభివృద్ధి చేస్తాం
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. - 
                                    
                                        

ఏడు క్వింటాళ్ల పరిమితి నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి
ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. - 
                                    
                                        

నెలాఖరులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. రూ.123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారంలో నిర్లక్ష్యం వద్దు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ నిర్లక్ష్యం చూపించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. - 
                                    
                                        

వ్యవసాయ విద్యలో సంయుక్త బీఎస్సీ కోర్సు
దేశంలో తొలిసారిగా.. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ కోర్సును సంయుక్తంగా నిర్వహించేందుకు తెలంగాణ అగ్రి వర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్టర్న్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. - 
                                    
                                        

మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలోని 3 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా.. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విన్నవించారు. - 
                                    
                                        

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించండి
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కార్డుల జారీపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఉద్యోగుల ఐకాస (టీజీఈజాక్) కోరింది. - 
                                    
                                        

ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. మహారాష్ట్రకు సంబంధించి ఇలాంటి కేసుపైనే ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం... - 
                                    
                                        

ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే!
తెలంగాణ హైకోర్టులో తనను జడ్జిగా నియమించాలంటూ జి.వి.సర్వన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. - 
                                    
                                        

కేకు.. ఆలోచన కేక
ఇక్కడ కేకులపై కనిపిస్తున్న చిత్రాలు హైదరాబాద్లోని ట్రాఫిక్ జంక్షన్లవి. మరి ఇలా కేకులపై ఎందుకు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా? నగరంలో సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కూడళ్లను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ... - 
                                    
                                        

రైల్వే స్టేషన్లే విద్యుత్ కేంద్రాలు
రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారాలపై లైట్లు, ఫ్యాన్లు, అనౌన్స్మెంట్ సిస్టమ్, టికెట్ కౌంటర్లు.. ఇలా అన్నింటికి కలిపి పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 55 రైల్వేస్టేషన్లు, కార్యాలయ భవనాలకు ఇప్పుడు ఆ శక్తి సూర్యుడి నుంచే అందుతోంది. - 
                                    
                                        

ఓటు వేటలో నాగసాధువులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు మద్దతుగా వారణాసి నుంచి వచ్చిన 11 మంది సోమవారం ప్రచారం నిర్వహించారు. - 
                                    
                                        

రామచక్కని సీతమ్మకు.. చక్కనైన గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన శంకర్నారాయణ-రాజ్యలక్ష్మి అనే దంపతులు రెండ్రోజుల కిందట రూ.40 లక్షల విలువైన రజత గజ వాహనాన్ని అందజేశారు. - 
                                    
                                        

కడలుంగీ.. రఘునాథపురం టు ఉగాండా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో మరమగ్గాలపైన రూపుదిద్దుకుంటున్న కడలుంగీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా దేశానికి సరఫరా అవుతోంది. - 
                                    
                                        

హైకోర్టు ఉద్యోగిని తెలంగాణకు తిరిగి కేటాయించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన పీవీ సతీష్కుమార్ అనే హైకోర్టు ఉద్యోగిని తిరిగి తెలంగాణకు కేటాయించడానికి నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తంచేసింది. - 
                                    
                                        

జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం
వ్యాపార విస్తరణలో భాగంగా మరో జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. నాగ్పుర్లోని కేంద్ర గనులశాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం.. - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లు.. ఏడు క్వింటాళ్లకు కుదింపు
భారత పత్తి సంస్థ(సీసీఐ) తాజాగా మరో కఠిన నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఎకరాకు సగటున 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే నిబంధనలను సోమవారం నుంచి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయటం విస్మయానికి గురిచేసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
 - 
                        
                            

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
 - 
                        
                            

హైదరాబాద్లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

ఆయనను భారత్కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 - 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 


