ఈఎన్సీగా పోస్టింగ్‌... ఆ వెంటనే పదవీ విరమణ

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 03:48 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్సీ) జి.అనిల్‌కుమార్‌కు కరీంనగర్‌ ఈఎన్సీగా పోస్టింగ్‌ ఇస్తూ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఆయన పదవీ విరమణ కూడా శుక్రవారమే కావడం విశేషం. ఈఎన్సీగా (జనరల్‌) విధులు నిర్వహించిన అనిల్‌కుమార్‌ను ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ 16న ఆ పోస్టు నుంచి తొలగించింది. అప్పటి నుంచి ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఆయకట్టు అభివృద్ధి విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ రఘునాథరావు కూడా  పదవీ విరమణ పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు