నాగారం భూముల వ్యవహారంలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఊరట

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 03:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మధ్యంతర ఉత్తర్వులను సవరించిన హైకోర్టు 

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వారి కుటుంబసభ్యులు కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలో యథాతథస్థితి కొనసాగించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం హైకోర్టు సవరించింది. సర్వే నం.194, 195లో వీరు కొనుగోలు చేసిన భూములపై ఉన్న యథాతథస్థితి ఉత్తర్వులను రద్దు చేసింది. సర్వే నం.181, 182ల్లో మాత్రం కొనసాగుతాయంది. నాగారం భూములపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐపీఎస్‌లు రవిగుప్త, తరుణ్‌జోషి, జితేందర్‌కుమార్‌ గోయల్‌ భార్య రేణుగోయల్, మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ భార్య జ్ఞానముద్ర తదితరులు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అధికారుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... భూదాన్‌ భూములన్నీ 181, 182లో ఉన్నాయని, వీటిలో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలంటూ బీర్ల మల్లేశ్‌ పిటిషన్‌ దాఖలు చేశారన్నారు. అందులో ఎక్కడా ఐఏఎస్, ఐపీఎస్‌ తదితరులు కొనుగోలు చేసిన సర్వే నం.194, 195ల్లోని భూముల గురించి ప్రస్తావించలేదన్నారు. ఈ రెండు సర్వే నంబర్లలో ఉన్నవి పట్టా భూములేనన్నారు. వాదనలు విన్న ధర్మాసనం సింగిల్‌ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల నుంచి 194, 195 సర్వే నంబర్లను మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారుల భూములన్నీ నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు