12,911 టన్నుల తడిసిన ధాన్యం బాయిల్డ్‌ మిల్లులకు కేటాయింపు

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 03:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నాలుగు జిల్లాలపై పౌరసరఫరాల సంస్థ నిర్ణయం 

ఈనాడు, హైదరాబాద్‌: తుపాను ప్రభావంతో కొనుగోలు కేంద్రాల్లో వర్షాలకు తడిసిన ధాన్యంలో 12,911 టన్నులు బాయిల్డ్‌ మిల్లులకు కేటాయిస్తూ పౌరసరఫరాల సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇందులో 7,411 టన్నులు ఆయా మిల్లులకు శుక్రవారం తరలించారు. ఎఫ్‌సీఐ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలంటే తేమ 17% దాటకూడదు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ నాలుగు జిల్లాల్లో నష్టం తీవ్రంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మార్కెట్‌యార్టులో తూకం వేసినవాటితోపాటు వేయని ధాన్యం కలిపి 526 టన్నుల్ని బాయిల్డ్‌మిల్లులకు కేటాయించారు. అందులో ఇప్పటికే 400 టన్నులను మిల్లులకు తరలించారు. నల్గొండ జిల్లాలో 4,600 టన్నుల తడిసిన ధాన్యంలో 2,600 టన్నుల వడ్లను బాయిల్డ్‌మిల్లులకు తరలించినట్లు పౌరసరఫరాల సంస్థ జీఎం నాగేశ్వరరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు