పిలుస్తోంది.. పర్యాటక లోకం!

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 04:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ప్రశాంత వాతావరణానికి తోడు అడవిలోనే విలాసవంతమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ అడవిని పర్యాటకుల సరికొత్త గమ్యస్థానంగా అటవీ శాఖ తీర్చిదిద్దింది. తొలిసారి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో ఎకో అర్బన్‌ పార్కును అభివృద్ధి చేసింది. ఇక్కడ మొత్తం 352 ఎకరాల అటవీ విస్తీర్ణంలో పెద్ద సంఖ్యలో జింకలు, అడవి పందులు, పలు రకాల పక్షులు ఉన్నాయి. టేకు, మద్ది, వేప సహా 100 రకాల చెట్లు ఉన్నాయి. దీన్ని ఆనుకుని ఉన్న 12 ఎకరాల రెవెన్యూ భూమిని అటవీ శాఖ కొనుగోలు చేసింది. అందులో 40 కాటేజీలు, స్విమ్మింగ్‌పూళ్లు, బోటింగ్, జిమ్, స్పా వంటి ఆధునిక సదుపాయాల్ని కల్పించారు. ఎకో పార్కు నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లి తిరిగివచ్చేలా సఫారీ ఏర్పాటు చేస్తున్నారు. ఇది అటవీ ప్రాంతంలో 7 కి.మీ. మేర సాగుతుంది. పిల్లలకు ప్రకృతి, పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు, వినోదం కోసం ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌నూ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టును శనివారం అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించనున్నారు. 

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు